యువకుల స్వయం ఉపాధి | - | Sakshi
Sakshi News home page

యువకుల స్వయం ఉపాధి

Jun 12 2025 3:43 AM | Updated on Jun 12 2025 3:43 AM

యువకు

యువకుల స్వయం ఉపాధి

దోమకొండ: మండల కేంద్రానికి చెందిన నలుగురు యువకులు పాడి పశువుల డెయిరీఫాంతో పాటు గొర్రెలు షేడ్‌ ఏర్పాటు చేసి స్వయం ఉపాధి పొందుతూ ఆదర్శంగా నిలుస్తున్నారు. గ్రామ శివారులోని కుడి చెరువు కింద తన మిత్రుడికి చెందిన దాదాపు 9 ఎకరాలు వ్యవసాయ భూమిని వారు లీజుకు తీసుకున్నారు. దీంట్లో ముందుగా డెయిరీఫాంను ప్రారంభించారు. పెద్ద ఎత్తున షేడ్‌ నిర్మాణం చేపట్టారు. ఏపీలోని కాకినాడ నుంచి 10 బర్రెలను కొనుగోలు చేశారు. అనంతరం హర్యానా రాష్ట్రం నుంచి మరో 10 బర్రెలను కొనుగోలు చేశారు. ప్రస్తుతం అవి ప్రతిరోజు 130 నుంచి 150 లీటర్ల పాలను ఇస్తున్నట్లు వారు తెలిపారు. దీనికి తోడు ఇటీవల గొర్రెల షేడ్‌ను కూడా ఏర్పాటు చేసుకున్నారు. వీటితో పాటు కూరగాయల సాగును కూడా చేస్తున్నారు. డెయిరీ ఫాం ద్వారా వస్తున్న పాలను మండల కేంద్రంలో రెండు పాయింట్లను ఏర్పాటు చేసి విక్రయిస్తున్నారు. డెయిరీఫాం ద్వారా ప్రస్తుతం రోజుకు దాదాపు రూ. 8 వేల నుంచి రూ. 9 వేల వరకు ఆదాయం వస్తుందని వారు తెలిపారు. దీనికి తోడు కూరగాయల ద్వారా ప్రతి వారం మరికొంత ఆదాయం సమకూరుతుంది. పశువులకు దాణాను కూడా అక్కడే పెంచుతున్నారు. చదువుకుని ఎక్కడో ఇతర ప్రాంతాలు, వాణిజ్య దుకాణాల్లో జీతం ఉండే కంటే స్వయం ఉపాధి ద్వారా కష్టపడి ముందుకు సాగుతున్న వీరు మండల కేంద్రానికి ఆదర్శంగా నిలిస్తున్నారు. వీరిని మండలానికి చెందిన పలువురు అభినందిస్తున్నారు.

దోమకొండలో పశువుల కోసం ఏర్పాటు చేసిన డెయిరీ ఫాం

కాకినాడ, హర్యానా నుంచి

బర్రెల కొనుగోలు

పాడి పశువులు, గొర్రెల ఫాం

షేడ్‌ల ఏర్పాటు

కూరగాయల సాగుకు ప్రాధాన్యం

నలుగురు మిత్రులం కలిసి ఏర్పాటు చేశాం

మండల కేంద్రానికి చెందిన మిత్రులం కలిసి డెయిరీ ఫాం ఏర్పాటు చేయాలని అనుకున్నాం. దానికి గాను నా సొంత స్థలంను మిత్రులందరం కలిసి లీజుకు అగ్రిమెంట్‌ రాసుకున్నాం. ప్రస్తుతం డెయిరీ షేడ్‌ పూర్తి కాగా 20 బర్రెలను తీసుకువచ్చాం. దీంతో పాటు గొర్ల షేడ్‌ కూడా వేశాం. వీటికి తోడు కూరగాయల పంటలు సాగుచేస్తున్నాం. అందరం కలిసి ఉదయం నుంచి సాయంత్రం వరకు పనులు చూసుకుంటాము.

– భూపాల సురేశ్‌, దోమకొండ

పశువులకు గడ్డిని పెంచుతున్నాం

దోమకొండలోని కుడి చెరువు కింద డెయిరీ ఫాం ఏర్పాటు చేశాం. గ్రామ శివారులో ఉండటంతో ప్రతిరోజు నలుగురం కలిసి పనులు చేస్తాం. 20 బర్ల ద్వారా దాదాపు రోజుకు 130 నుంచి 150 లీటర్ల పాలు వస్తున్నాయి. వీటిని విక్రయించడానికి రెండు సెంటర్లు ఏర్పాటు చేశాం. పశువులకు ప్రత్యేకంగా దాణాను కూడా మేమే పెంచుతున్నాం. కూరగాయాల సాగుతో కూడా మరికొంత ఆదాయం వస్తుంది.

– మద్దురి భూపాల్‌రెడ్డి, దోమకొండ

యువకుల స్వయం ఉపాధి 1
1/3

యువకుల స్వయం ఉపాధి

యువకుల స్వయం ఉపాధి 2
2/3

యువకుల స్వయం ఉపాధి

యువకుల స్వయం ఉపాధి 3
3/3

యువకుల స్వయం ఉపాధి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement