
బైక్ల చోరీ కేసులో నిందితుల అరెస్టు
ఖలీల్వాడి: బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరిని అరెస్ట్ చేసి, రిమాండ్కు తరలించినట్లు ఏసీపీ రాజావెంకట్రెడ్డి తెలిపారు. జిల్లా కేంద్రంలోని ఏసీపీ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఏసీపీ రాజావెంకట్రెడ్డి, టా స్క్ఫోర్స్ ఏసీపీ నాగేంద్రచారి వివరాలు వెల్లడించారు. నగరంలోని ఒకటో టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం ఉదయం పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా అనుమానాస్పదంగా కనిపించిన ఇద్దరిని పట్టుకున్నారు. వారిని విచారించగా బైక్లను దొంగతనాలు చేసినట్లు తెలిపారు. నిందితులు బోధన్ పట్టణానికి చెందిన మాలోత్ రమేష్, కటం రవిగా గుర్తించారు. నిందితులు బాసర్ రైల్వేస్టేషన్లో ఒక బైక్, తిర్మన్పల్లి గ్రామంలో ఒక బైక్, వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో ఒకటి, నిజామాబాద్ పట్టణంలో మూడు బైకులను చోరీ చే సినట్లు ఒప్పుకున్నారు. వాటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు గతంలో బైక్ చోరీ కేసులో జైలుకు వెళ్లివచ్చినట్లు తెలిపారు. వారిపై కే సు నమోదు చేసి జైలుకు తరలించినట్లు తెలిపా రు.ఎస్హెచ్వో రఘుపతి,తదితరులు పాల్గొన్నారు.
పేకాడుతున్న 10మంది..
ఖలీల్వాడి: నగరంలోని గౌతమ్నగర్లో విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు పేకాట స్థావరంపై దాడి చేశారు. పేకాడుతున్న 10 మందిని అరెస్ట్ చేశారు. 8సెల్ఫోన్లు, రూ. 5660 స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై హరిబాబు తెలిపారు.
రౌడీషీటర్ గ్యాంగ్ సభ్యుడు..
ఖలీల్వాడి: నగరంలోని ఒకటో టౌన్ పోలీస్స్టేషన్ పరిధిలోని ఓ హోటల్ వద్ద ఆటో డ్రైవర్ను బెదిరింపులకు పాల్పడిన కేసులో రౌడీషీటర్ బర్సాత్ ఆమీర్ అనుచరుడు ఇర్ఫాన్ను అరెస్ట్ చేసినట్లు ఎస్హెచ్వో రఘుపతి బుధవారం తెలిపారు. ఇర్ఫాన్ నుంచి ఒక తల్వార్, రెండు కత్తులు, రెండు పంచ్లు, 50 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. బర్సాత్ అమీర్తోపాటు మరో 10 మంది పరారీలో ఉన్నట్లు తెలిపారు. ఇర్ఫాన్ను రిమాండ్కు తరలించినట్లు చెప్పారు.