
‘ప్రభుత్వం అండగా ఉంటుంది’
కామారెడ్డి క్రైం: కరోనాతో తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు ప్రభుత్వం అండగా ఉంటుందని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ పేర్కొ న్నారు. కరోనాతో తల్లిదండ్రులను కోల్పోయిన వారి బాగోగులు తెలుసుకునేందుకు మంగళవారం కలెక్టర్ కార్యాలయంలో స మావేశం నిర్వహించారు. కార్యక్రమంలో బాధిత పిల్లలు, వారి సంరక్షకులు పాల్గొన్నా రు. బాగా చదువుకొని భవిష్యత్తులో ఉన్నత స్థానాల్లో నిలవాలని కలెక్టర్ సూచించారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి ప్రమీల, బాలల పరిరక్షణ అధికారి స్రవంతి, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ మెంబర్ స్వర్ణలత, డీసీపీయూ సిబ్బంది పాల్గొన్నారు.
రాష్ట్రస్థాయి బ్యాడ్మింటన్ టోర్నీకి ఎంపిక
కామారెడ్డి అర్బ న్: తమ పాఠశా ల విద్యార్థి వెంకట్ రాష్ట్రస్థాయి అండర్–11 బ్యాడ్మింటన్ టోర్నమెంట్కు ఎంపికయ్యాడని జిల్లాకేంద్రంలోని అక్షర హైస్కూల్ ప్రిన్సిపల్ సంగీతారెడ్డి తెలిపారు. ఇటీవల జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీలలో సత్తా చాటడంతో రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేశారన్నారు. విద్యార్థిని స్కూల్ కరస్పాండెంట్ లోకేష్రెడ్డి, కోచ్ సందీప్గౌడ్ అభినందించారన్నారు.
‘మాదకద్రవ్యాలకు
బానిసలు కావొద్దు’
కామారెడ్డి అర్బన్ : మాదక ద్రవ్యాలకు బానిసలు కావొద్దని, బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని కామారెడ్డి ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మాదక ద్రవ్యాల నియంత్రణ కన్వీనర్లు విశ్వప్రసాద్, ఆకుల సుధాకర్ పేర్కొన్నారు. మంగళవారం కళాశాలలో ప్రిన్సిపల్ విజయ్కుమార్ అధ్యక్షతన మాదక ద్రవ్యాల నియంత్రణపై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. విద్యార్థులకు క్విజ్తోపాటు చర్చాగోష్టి నిర్వహించారు. మాదక ద్రవ్యాలతో మానసికంగానే కాకుండా ఆరోగ్యపరంగా, ఆర్థికంగా, సామాజికంగా పతనం అవుతారని ప్రిన్సిపల్ విజయ్కుమార్ పేర్కొన్నారు. వాటికి దూరంగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ కిష్టయ్య, అధ్యాపకులు శ్రీనివాస్రావు, కవిత, తబస్బేగం, అనిల్కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
బలమైన గాలులకు ఇద్దరి బలి
బాన్సువాడ: బలమై న గాలులు ఇద్దరి ప్రాణాలను బలిగొన్నాయి. బాన్సువాడలో గాలి ప్రభావానికి దాబాపైనుంచి పడి ఒకరు మరణించగా.. నిజామాబాద్లో రేకులు విరిగి మీదపడడంతో మరొకరు మృత్యువాతపడ్డారు. వివరాలిలా ఉన్నాయి. బాన్సువాడ బల్దియా పరిధిలోని తాడ్కోల్ శివారులోగల డబుల్ బెడ్ రూం కాలనీలో ప్రభు (55) నివసిస్తున్నాడు. సోమవారం రాత్రి అతడు దాబాపై పడుకున్నాడు. గాలులు వీయడంతో నిద్రలోంచి మేల్కొని, నిల్చున్నాడు. గాలులు బలంగా వీయడంతో అదుపుతప్పి కిందపడి మరణించాడు. మృతుడి భార్య విజయ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు సీఐ అశోక్ తెలిపారు.
నిజామాబాద్లో..
ఖలీల్వాడి: నిజామాబాద్ సంజీవరెడ్డి కాల నీకి చెందిన విద్యుత్ లైన్ ఇన్స్పెక్టర్ ఆస్వాడ్ శ్రీనివాస్(55) సోమవారం రాత్రి వర్షం రా వడంతో వినాయక్నగర్లోని కల్లు బట్టిలోకి వెళ్లాడు. ఆ సమయంలో చెట్టుకూలి కల్లుబట్టిపై పడడంతో, రేకులు విరిగి శ్రీనివాస్పై పడ్డాయి. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడి మరణించాడు. కేసు నమోదు చేసుకున్న ట్లు నాలుగో టౌన్ ఎస్సై శ్రీకాంత్ తెలిపారు.

‘ప్రభుత్వం అండగా ఉంటుంది’

‘ప్రభుత్వం అండగా ఉంటుంది’