వాటర్‌ ట్యాంక్‌ ఎక్కిన కాంగ్రెస్‌ నాయకులు | - | Sakshi
Sakshi News home page

వాటర్‌ ట్యాంక్‌ ఎక్కిన కాంగ్రెస్‌ నాయకులు

Jun 11 2025 9:04 AM | Updated on Jun 11 2025 9:04 AM

వాటర్‌ ట్యాంక్‌ ఎక్కిన కాంగ్రెస్‌ నాయకులు

వాటర్‌ ట్యాంక్‌ ఎక్కిన కాంగ్రెస్‌ నాయకులు

బోధన్‌టౌన్‌(బోధన్‌): ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డికి మంత్రి పదవి ఇవ్వకపోవడాన్ని నిరసిస్తూ బోధన్‌ పట్టణ యువజన కాంగ్రెస్‌ నాయకులు బీటీ నగర్‌ కా లనీలోని వాటర్‌ ట్యాంక్‌ ఎక్కి నిరసన తెలిపారు. సీ నియర్‌ నాయకుడు, కష్టకాలంలో పార్టీకి అండగా నిలిచిన సుదర్శన్‌రెడ్డికి అధిష్టానం మంత్రి పదవి ఇవ్వక పోవడం సరికాదని, సీఎం రేవంత్‌రెడ్డి తక్షణ మే అధిష్టానంతో మాట్లాడి మంత్రి పదవి ఇవ్వా లని డిమాండ్‌ చేశారు. సుదర్శన్‌రెడ్డికి మంత్రి పదవి ఇవ్వకపోతే తాము ట్యాంక్‌ పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకుంటామని యువజన కాంగ్రెస్‌ పట్టణ అధ్యక్షులు తలారి నవీన్‌కుమార్‌తోపాటు మరో ముగ్గురు నాయకులు హెచ్చరించారు. సమాచారం అందుకున్న పోలీసులు బీటీనగర్‌ కాలనీకి చేరుకుని పార్టీ పట్టణ అధ్యక్షుడు పాషా మొయినొద్దీన్‌తో మా ట్లాడారు. వాటర్‌ ట్యాంక్‌ ఎక్కిన వారిని కిందికి ది గాలని పోలీసులు కోరారు. అయినప్పటికీ వారు వినకపోవడంతో కలగజేసుకున్న నాయకులు.. తాము పీసీసీ అధ్యక్షుడితో మాట్లాడామని చెప్పడంతో వారు ట్యాంక్‌పై నుంచి కిందికి దిగి వచ్చారు.

సుదర్శన్‌రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలని..

సముదాయించిన నాయకులు, పోలీసులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement