
పిచ్చి కుక్కల దాడిలో నలుగురికి గాయాలు
బాన్సువాడ: బీర్కూర్ మండలం బైరాపూర్ గ్రామంలో పిచ్చి కుక్కల దాడిలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. గ్రామంలోని వేర్వేరు ప్రాంతాల్లో మంగళవారం ఉదయం ఒంటిరిగా వెళ్తున్న రాచకొండ భూమవ్వ, మేకల బేతయ్య, మేకల సాయిలు, బీహారి కూలీపై కుక్కలు దాడి చేసి తీవ్రంగా కరిచాయి. వెంటనే స్థానికులు గమనించి క్షతగాత్రులను చికిత్స నిమిత్తం బీర్కూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. వైద్యుల సలహా మేరకు అక్కడి నుంచి నిజామాబాద్కు తరలించారు. నిజామాబాద్ ఆస్పత్రిలో ప్రస్తుతం వీరందరు చికిత్స పొందుతున్నారు.