వేర్వేరు ఘటనల్లో పలువురి మృతి | - | Sakshi
Sakshi News home page

వేర్వేరు ఘటనల్లో పలువురి మృతి

Jun 11 2025 9:04 AM | Updated on Jun 11 2025 9:04 AM

వేర్వ

వేర్వేరు ఘటనల్లో పలువురి మృతి

రెండు బైక్‌లు ఢీకొని ఇద్దరు..

బాన్సువాడ: బీర్కూర్‌ మండలం కిష్టాపూర్‌ శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడిక్కడే మృతి చెందారు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా.. చించోల్లి గ్రామానికి చెందిన ఇల్తాం గంగారం (40) ట్రాక్టర్‌లోకి డీజిల్‌ కోసం మంగళవారం రాత్రి బైక్‌పై బీర్కూర్‌ వెళ్లాడు. అదే రాత్రి డీజిల్‌ తీసుకుని బైక్‌పై చించోల్లికి బయలుదేరాడు. అలాగే అన్నారం గ్రామానికి చెందిన సంగెం నందు(18) అనే యువకుడు మార్కెట్‌ కోసం బీర్కూర్‌కు బైక్‌పై బయలుదేరాడు. బీర్కూర్‌ మండలం కిష్టాపూర్‌ శివారులో వీరిద్దరి బైక్‌లు ఎదురెదురుగా వచ్చి ఢీకొన్నాయి. ఈ ఘటనలో గంగారం, నందుకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న బాన్సువాడ ఎస్సై రాజశేఖర్‌ ఘటన స్థలానికి చేరుకొని, వివరాలు సేకరించారు. మృతదేహాలను బాన్సువాడ ఆస్పత్రికి తరలించి, కేసు నమోదు చేసుకున్నారు. రోడ్డు ప్రమాదంలో పక్కపక్క గ్రామాలకు చెందిన ఇద్దరు మృతి చెందడంతో ఆయా గ్రామాల ప్రజలు పెద్దఎత్తున ఘటన స్థలానికి చేరుకున్నారు. మృతుల కుటుంబసభ్యుల రోదనలు అందరిని కంటతడి పెట్టించాయి.

నందిపేటలో..

నందిపేట్‌(ఆర్మూర్‌): మండల కేంద్రానికి చెందిన ఓ యువకుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా.. నందిపేటకు చెందిన ఇమ్ముల రంజిత్‌(21) అలియాస్‌ దేవళ్ల సిద్దు అనే యువకుడు ఉపాధి నిమిత్తం హైదరాబాద్‌లో ఉంటున్నాడు. రంజిత్‌ నందిపేట మండలం సీహెచ్‌ కొండూర్‌ గ్రామానికి చెందిన తన స్నేహితుడిని వెంటబెట్టుకుని బైక్‌పై మంగళవారం ఉదయం హైదరాబాద్‌ నుంచి నందిపేటకు బయలుదేరాడు. హైదరాబాద్‌ శివారులో రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా నిర్మించిన పిల్లర్‌ను వీరి బైక్‌ ఢీకొట్టింది. ఈ ఘటనలో రంజిత్‌ తీవ్ర గాయాలై అక్కడికక్కడే మరణించాడు. సీహెచ్‌ కొండూర్‌ గ్రామానికి చెందిన మరో యువకుడికి తీవ్ర గాయాలైనట్లు తెలిసింది.

వేల్పూర్‌ మండలంలో..

వేల్పూర్‌: మండలంలోని పడగల్‌ గ్రామంలోగల కొత్తచెరువులో ఓ పశువుల కాపరి ప్రమాదవశాత్తు పడి మృతిచెందాడు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా.. గ్రామానికి చెందిన పశువుల కాపరి సెవ్వ రాజయ్య(52) చాలాకాలంగా స్థానిక గురడికాపు వర్గానికి చెందిన పశువులను మేపేవాడు. సోమవారం పశువులను మేపడానికి తీసుకెళ్లగా, చెరువులోకి వెళ్లిన పశువులను తీసుకురావడానికి నీటిలోకి దిగాడు. పశువులను బయటకు తెచ్చే ప్రయత్నంలో ప్రమాదవశాత్తు నీటమునిగి మృతిచెందాడు. మంగళవారం అతడి మృతదేహం తేలడంతో పోలీసులు బయటకు తీసి,, పోస్టుమార్టం కోసం ఆర్మూర్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

రైలులో గుర్తుతెలియని వ్యక్తి...

ఖలీల్‌వాడి: నిజామాబాద్‌ రైల్వేస్టేషన్‌ పరిధిలో రైలులో ప్రయాణిస్తున్న గుర్తు తెలియని వ్యక్తి అనారోగ్యంతో మృతి చెందినట్లు రైల్వే ఎస్సై సాయిరెడ్డి మంగళవారం తెలిపారు. సోమవారం అర్ధరాత్రి ఒక గుర్తుతెలియని వ్యక్తి గుంతకల్లు నుంచి బోధన్‌ (రైలు నెంబర్‌ 57411) వెళ్లు రైలులో ప్రయాణిస్తుండగా, అనారోగ్య కారణాలతో మృతిచెందాడు.

నిజామాబాద్‌ స్టేషన్‌ మేనేజర్‌ దుర్గ ప్రసాద్‌ ఇచ్చిన సమాచారం పోలీసులు ఘటన స్థలానికి వెళ్లి, పరిశీలించారు. మృతుడి వద్ద ఎలాంటి ఆధారాలు దొరకలేదన్నారు. మృతుడి వయస్సు సుమారు 50–55ఏళ్ల మధ్య ఉంటుందన్నారు. కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని నిజామాబాద్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఎవరికై నా మృతుడి సమాచారం తెలిస్తే రైల్వే ఎస్సై 87126 58591 నంబరుకు సమాచారం ఇవ్వాలన్నారు.

చికిత్స పొందుతూ ప్రభుత్వ పీఈటీ..

మాక్లూర్‌: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ ఒకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. వివరాలు ఇలా.. జక్రాన్‌పల్లి మండలం బ్రాహ్మణపల్లికి చెందిన గోడ దివాకర్‌(45)అనే ప్రభుత్వ వ్యాయామ ఉపాధ్యాయుడు నిజామాబాద్‌లోని కంఠేశ్వర్‌లో నివాసం ఉంటూ మోస్రా ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పీఈటీగా విధులు నిర్వహిస్తున్నాడు. మే 30న స్కూటీపై తన స్వగ్రామం బ్రాహ్మణపల్లి వెళ్లి తిరిగి వస్తుండగా మాక్లూర్‌ మండలం దాస్‌నగర్‌ శివారులో 63వ నంబర్‌ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. తీవ్ర గాయాలు కావడంతో మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని నిమ్స్‌ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం తెల్లవారుజామున మృతి చెందినట్టు ఎస్సై రాజశేఖర్‌ తెలిపారు. మృతుడి భార్య నిరోషా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన వివిధ ఘటనల్లో పలువురు మృతిచెందారు. నందిపేట, బాన్సువాడ మండలాల పరిధిలో జరిగిన రెండు రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు మృత్యువాతపడ్డారు. అలాగే వేల్పూర్‌ మండలంలో చెరువులో పడి ఒకరు, నిజామాబాద్‌ రైల్వే స్టేషన్‌ పరిధిలో గుర్తుతెలియని వ్యక్తి అనారోగ్యంతో మృతిచెందారు.

వేర్వేరు ఘటనల్లో పలువురి మృతి 1
1/4

వేర్వేరు ఘటనల్లో పలువురి మృతి

వేర్వేరు ఘటనల్లో పలువురి మృతి 2
2/4

వేర్వేరు ఘటనల్లో పలువురి మృతి

వేర్వేరు ఘటనల్లో పలువురి మృతి 3
3/4

వేర్వేరు ఘటనల్లో పలువురి మృతి

వేర్వేరు ఘటనల్లో పలువురి మృతి 4
4/4

వేర్వేరు ఘటనల్లో పలువురి మృతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement