
ఇందిరా మహిళా శక్తి భవన నిర్మాణ పనులు వేగవంతం చేయాలి
కామారెడ్డి క్రైం: ఇందిరా మహిళా శక్తి భవన నిర్మాణం పనులలో వేగం పెంచాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ పంచాయతీరాజ్ ఇంజినీర్ ను ఆదేశించారు. కలెక్టర్ మంగళవారం కామారెడ్డి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయ సమీపంలో నిర్మాణంలో ఉన్న ఇందిరా మహిళా శక్తి భవన నిర్మాణ పనులను పరిశీలించారు. మేసీ్త్రలను, ఇతర కార్మికులను అధికంగా నియమించుకొని పనుల్లో వేగం పెంచి నవంబర్లోగా పూర్తిస్థాయిలో నిర్మాణం పనులు జరిపించాలని పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ డీఈ స్వామి దాస్, ఏఈ సంజయ్ని ఆదేశించారు.
ఈవీఎం గోదాం పరిశీలన
కామారెడ్డి క్రైం: ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఈవీఎం గోడౌన్కు రక్షణ చర్యలు కల్పించాలని సెక్యూరిటీ సిబ్బందిని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ఆదేశించారు. మూడు నెలల సాధారణ తనిఖీల్లో భాగంగా మంగళవారం కలెక్టర్ ఈవీఎం గోడౌన్ను సందర్శించారు. గోడౌన్లో సెక్యూరిటీ కోసం చేసిన ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఈవీ ఎం గోడౌన్ను గుర్తింపు పొందిన రాజకీయ పా ర్టీల ప్రతినిధుల సమక్షంలో పరిశీలించామన్నా రు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ విక్టర్, కామారెడ్డి ఆర్డీవో వీణ, ఎలక్షన్ డీటీ అనిల్, వివిధ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.
పెట్రోల్బంకు ఏర్పాటు
కోసం స్థల పరిశీలన
నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): నాగిరెడ్డిపేట మండల సమాఖ్య ఆధ్వర్యంలో పెట్రోల్ బంకు ఏర్పాటు చేసేందుకు మంగళవారం బాన్సువాడ సబ్కలెక్టర్, ఎల్లారెడ్డి ఇన్చార్జి ఆర్డీవో కిరణ్మయి మాల్తుమ్మెద శివారులో స్థలాన్ని పరిశీలించారు. మండల సమాఖ్య ఆధ్వర్యంలో పెట్రోల్బంకు ఏర్పాటు కోసం స్థలాన్ని ఎంపిక చేయాలని జిల్లా అధికారుల నుంచి వచ్చిన ఆదేశాలమేరకు నాగిరెడ్డిపేట రెవెన్యూ అధికారులు మండలంలోని మాల్తుమ్మెద శివారులో గల సర్వే నం,834లో 10గుంటల భూమిని ఎంపిక చేశారు. ఈ మేరకు పెట్రోల్బంకు ఏర్పాటు కోసం ఎంపిక చేసిన స్థలాన్ని స్థానిక అధికారులతో కలిసి ఇన్చార్జీ ఆర్డీవో కిరణ్మయి పరిశీలించారు. మాల్తుమ్మెద శివారులో ఎంపిక చేసిన స్థలం వివరాలను అధికారులను అడిగి ఆమె తెలుసుకున్నారు. గతంలో డెయిరీ శిక్షణ కోసం 10ఎకరాల స్థలాన్ని ఐకేపీకి కేటాయిచారని అధికారులు ఆమెకు వివరించారు. ప్రస్తుతం అందులో నుంచి పెట్రోల్బంకు ఏర్పాటు కోసం స్థలాన్ని ఎంపిక చేశామని వారు తెలిపారు. ఆమెవెంట నాగిరెడ్డిపేట తహసీల్దార్ శ్రీనివాస్రావు, ఆర్ఐ మహ్మాద్, సీసీ శ్రీనివాస్రెడ్డి ఉన్నారు.
తెలంగాణ మలిదశ ఉద్యమకారుల జిల్లా కమిటీ నియామకం
బాన్సువాడ : తెలంగాణ మలిదశ ఉద్యమకారుల జిల్లా కమిటీని మంగళవారం బాన్సువాడలో ఏకగ్రీవంగా నియమించారు. మలిదశ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు ఆదేశానుసారంతో జిల్లా అధ్యక్షులు ఉడుత గంగాధర్ సమక్షంలో నూతన కమిటీని నియమించారు. జిల్లా ఉపాధ్యక్షుడిగా కడెం బాబాగౌడ్, ఉమ్మడి బీర్కూర్ మండలం అధ్యక్షులుగా ఆరేళ్ల పవన్గౌడ్లను నియమించారు. తెలంగాణ మలిదశ ఉద్యమకారుల సమస్యల కోసం పోరాటం చేస్తామని గంగాధర్ అన్నారు. ఈ కార్యక్రమంలో మలిదశ ఉద్యమకారులు గంజివార్ చందు, ఎర్రవాటి సాయిబాబా, మజీద్, భాస్కర్గౌడ్, కృష్ణ, మారుతి, గంగారం తదితరులున్నారు.

ఇందిరా మహిళా శక్తి భవన నిర్మాణ పనులు వేగవంతం చేయాలి

ఇందిరా మహిళా శక్తి భవన నిర్మాణ పనులు వేగవంతం చేయాలి