
కాంగ్రెస్ శ్రేణుల సంబురాలు
కామారెడ్డి టౌన్/భిక్కనూరు/దోమకొండ/కామారెడ్డి రూరల్ : జిల్లా కేంద్రంలోని నిజాంసాగర్ చౌరస్తాలో తెలంగాణ పీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా గడ్డం చంద్రశేఖర్రెడ్డి నియామకంపై మంగళవారం కాంగ్రెస్ శ్రేణులు సంబురాలు జరుపుకున్నారు. టపాసులు పేల్చి, స్వీట్స్ పంచకున్నారు. భారీ కేక్కు కట్ చేశారు. ఈ మేరకు కాంగ్రెప్ పార్టీ అధిష్టానానికి, జాతీయ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్, సీఎం రేవంత్రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్కుమార్గౌడ్లకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు శివకృష్ణమూర్తి, పంపరి శ్రీనివాస్, చాట్ల వంశీకృష్ణ, సలీమ్, సాయిబాబ, మహేష్, రాంమోహన్, జూలూరి సుధాకర్, సుగుణ, గ్యార సాయిలు తదితరులున్నారు.
పీసీసీ అధ్యక్షుడిని కలిసిన చంద్రశేఖర్రెడ్డి
టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్కుమార్గౌడ్ను మంగళవారం గడ్డం చంద్రశేఖర్రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. తనను జనరల్ సెక్రటరీగా నియమించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని మీ ఇచ్చారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. తెలంగాణ పీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కామారెడ్డికి చెందిన గడ్డం చంద్రశేఖర్రెడ్డి నియామకమైన సందర్భంగా దేవునిపల్లి డబుల్ బెడ్రూమ్ కమ్యూనిటీ అధ్యక్షుడు గడ్డం రవీందర్, జనరల్ సెక్రటరీ కే బాలాజీ, కమిటీ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో దేవునిపల్లి డబుల్ బెడ్ రూమ్ కమ్యూనిటీ సభ్యులు అశోక్, రవి, శీను తదితరులున్నారు.
కాంగ్రెస్ పార్టీలో ప్రజలకు సేవచేస్తే
తగిన గుర్తింపు : ఇంద్రకరణ్రెడ్డి
కాంగ్రెస్ పార్టీలో ప్రజలకు సేవ చేస్తేనే తగిన గుర్తింపు వస్తుందని కాంగ్రెస్ పార్టీ ప్రధానకార్యదర్శి బద్దం ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. పీసీసీ ప్రధాన కార్యదర్శిగా ఇంద్రకరణ్రెడ్డిని పార్టీ అధిష్టానం నియమించినందున ఆయనను కాంగ్రెస్ నేతలు ఆయన స్వగ్రామైన రామేశ్వర్ఫల్లిలో ఘనంగా సన్మానించారు. షబ్బీర్అలీకి రుణపడి ఉంటానన్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్రెడ్డి, మాజీ ఎంపీపీ తొగరి సుదర్శన్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు బల్యాల సుదర్శన్, నేతలు సుధాకర్రెడ్డి, తక్కళ్ల బాపురెడ్డి, శ్రీరాం వెంకటేశ్, నర్సింలు యాదవ్, సాజీద్, విజయ్ తదితరులు పాల్గొన్నారు. పీసీసీ ప్రధాన కార్యదర్శిగా నియమితులైన బద్దం ఇంద్రకరణ్రెడ్డిని దోమకొండ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు సన్మానించారు. గతంలో పీసీసీ కార్యదర్శిగా ఉన్న ఇంద్రకరణ్రెడ్డిని కాంగ్రెస్ అధిష్టానం ప్రధాన కార్యదర్శిగా నియమించిందని వారు తెలిపారు.

కాంగ్రెస్ శ్రేణుల సంబురాలు