
ఆర్మూర్లో బధిరుల పాఠశాల
ఆర్మూర్ పట్టణంలోని టీచర్స్ కాలనీలో 12 ఎకరాల సువిశాల స్థలంలో 1983 సెప్టెంబర్లో చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా, మెదక్ డయాసిస్ ఆధ్వర్యంలో తెలంగాణలోనే ఏకై క బధిరుల పాఠశాల ప్రారంభమైంది.
● ఐదుగురు విద్యార్థులతో ప్రారంభించిన పాఠశాల నేడు ఎంతో మందికి సేవలందిస్తూ ప్రత్యేక అవసరాలు గల పిల్లల్లో (దివ్యాంగుల్లో) ఆత్మ విశ్వాసాన్ని నింపుతోంది.
● ప్రస్తుతం నిజామాబాద్ జిల్లాకు చెందిన విద్యార్థులతోపాటు ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్ జిల్లాలకు చెందిన సుమారు 110 మంది విద్యనభ్యసిస్తున్నారు. వీరికి 15 మంది సిబ్బంది సేవలందిస్తున్నారు.
● పాఠశాల ప్రారంభం నుంచి సుమారు 500 మందికి పైగా చెవిటి, మూగ విద్యార్థులు విద్యాభ్యాసం పూర్తి చేసుకొని ఆయా ప్రాంతాలలో వివిధ వృత్తులలో జీవనం కొనసాగిస్తున్నారు.
● విద్యార్థులందరికీ సీఎస్ఐ గతంలో ఉచితంగా విద్యా, వసతిని కల్పించేది.
● ప్రస్తుతం నామమాత్రపు ఫీజులతో సంస్థను కొనసాగిస్తున్నారు.
● విద్యార్థులకు సామూహిక, వ్యక్తిగత వినికిడి యంత్రాల సహాయంతో పాఠ్యాంశాలను బోధిస్తూ ఆడిటరీ ట్రెయినింగ్, స్పీచ్ థెరపీని అందిస్తున్నారు.
● వృత్తి విద్య, సాంస్కృతిక, క్రీడా, విద్యా అంశాలలో బధిర విద్యార్థులను నిష్ణాతులుగా తీర్చిదిద్దుతున్నారు. – ఆర్మూర్
మీకు తెలుసా?