‘సనాతన ధర్మమే విశ్వగురువు’ | - | Sakshi
Sakshi News home page

‘సనాతన ధర్మమే విశ్వగురువు’

Jun 9 2025 12:52 AM | Updated on Jun 9 2025 12:52 AM

‘సనాత

‘సనాతన ధర్మమే విశ్వగురువు’

భిక్కనూరు: సనాతన ధర్మమే విశ్వగురువు గా మళ్లీ మారుతుందని ధర్మచార్య దర్శనయాత్ర నిర్వాహకులు, హిందు విరాట్‌ పరి వార్‌ ప్రతినిధి యజ్ఞం పవన్‌కుమార్‌శర్మ పేర్కొన్నారు. ఆదివారం ధర్మచార్య దర్శన యాత్ర భిక్కనూరు మండలంలోని పలు గ్రా మాలమీదుగా సాగి, సిద్దరామేశ్వరాలయానికి చేరుకుంది. సిద్దరామేశ్వరస్వామి, మాత భువనేశ్వరిదేవిలకు ప్రత్యేక పూజలు చేశా రు. వేదపండితుడు గంగవరం ఆంజనేయశర్మ ఆధ్వర్యంలో పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్‌కుమార్‌శర్మ మాట్లాడుతూ త్రిమతాచార్యులైన శంకరాచార్యులు, రామానుజాచార్యులు, మధ్వాచార్యుల ఆశయాల సాధన కోసం ఈ యాత్రను చేపట్టామన్నారు. బాసర వద్ద ప్రారంభమైన ఈ యాత్ర దేశంతో పాటు నేపాల్‌లోనూ సాగు తుందన్నారు. వేదవ్యాసుని పాదుకలతో ఈ యాత్రను నిర్వహిస్తున్నామన్నారు. కార్తీక పౌర్ణమి వరకు యాత్రను పూర్తి చేస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో సిద్దరామేశ్వరాలయం పూజారులు సిద్దగిరిశర్మ, రాజేశ్వరశర్మ పాల్గొన్నారు.

డిగ్రీ వన్‌టైం చాన్స్‌

బాన్సువాడ రూరల్‌: ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో మూడేళ్ల డిగ్రీ (నాన్‌ సెమి స్టర్‌) కోర్సులు తప్పిన పూర్వ విద్యార్థులు తి రిగి పరీక్ష రాసుకునేందుకు అవకాశం కల్పించారు. 2000 నుంచి 2015 సంవత్సరం వర కు బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీఏ, బీఎస్‌డ బ్ల్యూ కోర్సులను చదివి ఫెయిలైనవారు ఈ నెల 17 వరకు ఫీజు చెల్లించడానికి అవకాశం కల్పించారు. 2015–16 విద్యాసంవత్సరం సిలబస్‌ ప్రకారం పరీక్ష నిర్వహించనున్నా రు. పూర్తి వివరాలకోసం ఉస్మానియా యూ నివర్సిటీ వెబ్‌సైట్‌లో సంప్రదించాలని బా న్సువాడ ఎస్‌ఆర్‌ఎన్‌కే డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌ వేణుగోపాల స్వామి సూచించారు.

వలకు చిక్కిన భారీ చేపలు

లింగంపేట: మృగశిర కార్తె సందర్భంగా ఆది వారం చేపల వేట జోరుగా సాగింది. జాలరుల వలలకు భారీ చేపలు చిక్కాయి. భవానీపేట పట్నం చెరువులో 20 కిలోల చేప మత్స్యకారులకు లభించింది. ఆ చేపను రూ. 5 వేలకు విక్రయించినట్లు జాలరులు తెలిపారు. రాంపూర్‌ ఊర చెరువు 20 కిలోల భారీ చేప చిక్కింది.

బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణికి అభినందన

కామారెడ్డి టౌన్‌: హై దరాబాద్‌లో త్వరలో నిర్వహించే రాష్ట్ర స్థా యి బ్యాడ్మింటన్‌ టో ర్నీకి పట్టణానికి చెందిన ఎస్పీఆర్‌ విద్యార్థి అతిర ఎంపికై ంది. ఈ సందర్భంగా ఆమె ను స్కూల్‌ కరస్మాండెంట్‌ మారుతి, కోచ్‌ సందీప్‌గౌడ్‌ అభినందించారు. కామారెడ్డి బ్యాడ్మింటన్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ని ర్వహించిన బ్యాడ్మింటన్‌ జిల్లా స్థాయి అండ ర్‌ 13 బాలికల సబ్‌ జూనియర్‌ సింగిల్స్‌, డ బుల్స్‌ విభాగంలో ప్రతిభ చూపడంతో ఆమె ను రాష్ట్ర స్థాయి టోర్నీకి ఎంపిక చేశారని కోచ్‌ తెలిపారు.

రోడ్డు ప్రమాదంలో

ఎలుగుబంటి మృతి

ఇందల్వాయి: గుర్తు తెలియని వాహనం ఢీకొన్న ఘటనలో ఎలుగుబంటి మృతి చెందింది. ఈ ఘటన ఇందల్వాయి మండలం తిర్మన్‌పల్లి గ్రామ శివారులోని అటవీ ప్రాతంలో 44వ నంబరు జాతీయ రహదారిపై శనివారం రాత్రి చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న ఫారెస్ట్‌ సిబ్బంది ఎలుగుబంటి కళేబరాన్ని తిర్మన్‌పల్లి ఫారెస్ట్‌ సెంట్రల్‌ నర్సరీకి తరలించారు. డీఎఫ్‌వో వికాస్‌ మీనా ఆధ్వర్యంలో మండల పశు వైద్యాధికారి గంగాప్రసాద్‌ పోస్ట్‌మార్టం చేశారు. అనంతరం కళేబరాన్ని దహనం చేశారు. మృతి చెందిన మగ ఎలుగుబంటి వయస్సు మూడు సంవత్సరాలు ఉంటుందని ఎఫ్‌ఆర్‌వో రవిమోహన్‌ భట్‌ తెలిపారు.

‘సనాతన ధర్మమే  విశ్వగురువు’ 
1
1/3

‘సనాతన ధర్మమే విశ్వగురువు’

‘సనాతన ధర్మమే  విశ్వగురువు’ 
2
2/3

‘సనాతన ధర్మమే విశ్వగురువు’

‘సనాతన ధర్మమే  విశ్వగురువు’ 
3
3/3

‘సనాతన ధర్మమే విశ్వగురువు’

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement