సాగర్‌ కాలువలిలా.. సాగు నీరొచ్చేదెలా? | - | Sakshi
Sakshi News home page

సాగర్‌ కాలువలిలా.. సాగు నీరొచ్చేదెలా?

Jun 9 2025 12:52 AM | Updated on Jun 9 2025 12:52 AM

సాగర్

సాగర్‌ కాలువలిలా.. సాగు నీరొచ్చేదెలా?

బాన్సువాడ : నిజాంసాగర్‌ ఉపకాలువలు అధ్వానంగా మారాయి. కాలువల్లో పిచ్చి మొక్కలు, చెత్తాచెదారం, పూడిక పేరుకుపోయి సాగునీటి సరఫరాకు అడ్డుపడుతున్నాయి. సుమారు దశాబ్ద కాలంగా మరమ్మతులు లేకపోవడంతో చివరి ఆయకట్టుకు నీరందడం కష్టంగా మారింది. దీంతో ఉప కాలువలపై ఆధారపడి పంటలు సాగు చేస్తున్న అన్నదాతలు ఇబ్బందులు పడుతున్నారు. నిజాంసాగర్‌ ప్రాజెక్టు కింద అత్యధికంగా బాన్సువాడ నియోజకవర్గంలోని ఆయా గ్రామాల రైతులకు ప్రయోజనం చేకూరుతుంది. బాన్సువాడ నియోజకవర్గంలో డి–8 డిస్ట్రిబ్యూటర్‌ నుంచి ప్రారంభమై డి–39 డిస్ట్రిబ్యూటర్‌ వరకు ఉంటాయి. కాలువలను పట్టించుకునేవారు లేకపోవడంతో పిచ్చిమొక్కలు పెరిగాయి. గుర్రపుడెక్క వ్యాపించింది. పూడిక పేరుకుపోయింది. వేసవిలో కాలువల్లో పిచ్చిమొక్కలు తొలగించాల్సి ఉన్నా.. సిబ్బంది కొరతతో పనులు చేయడం లేదు.

కాలువ కట్టలు సైతం బలహీనంగా మారాయి. పలుచోట్ల కోతకు గురై ఎక్కడ గండి పడుతోందోనని రైతులు భయపడుతున్నారు. కాలువలకు మరమ్మతులు చేయించాలని రైతులు కోరుతున్నారు.

మండలం ఆయకట్టు

బాన్సువాడ 10,968

బీర్కూర్‌ 9,431

నస్రుల్లాబాద్‌ 7,748

వర్ని 5,064

రుద్రూర్‌ 3,272

మోస్రా 566

చందూర్‌ 2,513

కోటగిరి 21,370

నియోజకవర్గంలో నిజాంసాగర్‌ ఆయకట్టు వివరాలు.. (ఎకరాల్లో..)

పదేళ్లుగా మరమ్మతులు కరువు

ఏపుగా పెరిగిన పిచ్చిమొక్కలు

చివరి ఆయకట్టుకు అందని

సాగర్‌ నీరు

మరమ్మతులు చేయాలని

కోరుతున్న రైతులు

సాగర్‌ కాలువలిలా.. సాగు నీరొచ్చేదెలా?1
1/1

సాగర్‌ కాలువలిలా.. సాగు నీరొచ్చేదెలా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement