
నేడు కూచిపూడి కళాక్షేత్రం వార్షికోత్సవం
కామారెడ్డి అర్బన్ : కామారెడ్డి కూచిపూడి క ళాక్షేత్రం వార్షికోత్సవాలను ఆదివారం మ ధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి వరకు స్థా నిక కళాభారతి ఆడిటోరియంలో నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని కళాక్షేత్రం వ్యవ స్థాపకులు జాతీయ నృత్యకళాకారుడు వంశీప్రతాప్ గౌడ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ వేడుకలకు ముఖ్యఅతిథులుగా ప్రముఖ సినీ నటి ఆమని, తెలంగాణ ఫిల్మ్ చాంబర్ చైర్మ న్ పి.రామకృష్ణ గౌడ్, టీవీ నటుడు ప్రభాకర్లను ఆహ్వానించామని పేర్కొన్నారు. కార్య క్రమాన్ని విజయవంతం చేయాలని కళాభిమానులను కోరారు.
‘యశ్వంత్ సాధన యువతకు ఆదర్శం’
కామారెడ్డి క్రైం : యువ పర్వతారోహకుడు యశ్వంత్ తలపెట్టిన ‘హర్ శిఖర్ పర్ తిరంగా‘ కార్యక్రమం యువతకు ఆదర్శమని ఎ స్పీ రాజేశ్ చంద్ర పేర్కొన్నారు. జిల్లాకు చెందిన యశ్వంత్ మిజోరాం, మణిపూర్, త్రిపు ర, అరుణాచల్ ప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లోని ఎత్తైన శిఖరాలను విజయవంతంగా అధిరోహించాడు. ప్రతి శిఖరంపై త్రివర్ణ పతాకంతో పాటు ఎస్పీ రాజేశ్ చంద్ర సేవలకు గౌ రవ సూచకంగా ఆయన ఫొటోను ప్రదర్శించినట్లు యశ్వంత్ తెలిపాడు. శనివారం జి ల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ రాజేశ్ చంద్రను కలిసి, తాను అధిరోహించిన శిఖరాల పై ప్రదర్శిస్తూ తీసిన ఫొటోలను ఎస్పీకి అందించాడు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడు తూ భవిష్యత్తులో మరిన్ని శిఖరాలను అధిరోహించాలన్నారు. యశ్వంత్ ఇప్పటివరకు మౌంట్ కిలిమంజారో, మౌంట్ ఎల్బ్రస్, మౌంట్ కోసియస్కో, కాంగ్ యాట్సే ఐఐ, యూనామ్, ఎవరెస్ట్ బేస్ క్యాంప్ తదితర శిఖరాలను అధిరోహించాడు. ప్రపంచంలో ని ఏడు ఖండాల్లోని ఎత్తైన శిఖరాలను అధి రోహించడం తన లక్ష్యమని పేర్కొన్నాడు.
విద్యుత్ సమస్యను
పరిష్కరించాలి
పెద్దకొడప్గల్: విద్యుత్ సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ పిట్లం మండలానికి చెందిన అల్లాపూర్ గ్రామస్తులు శనివా రం పెద్దకొడప్గల్ విద్యుత్ కార్యాలయం వద్ద ఆందోళన చేశారు. అనంతరం ఇన్చార్జి విద్యుత్ మండల అధికారికి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా వారు మా ట్లాడుతూ పిట్లం మండలంలోని చిన్నకొడప్గల్ విద్యుత్ సబ్స్టేషన్ నుంచి తమ గ్రామానికి విద్యుత్ సరఫరా అవుతుందన్నారు. ఏ వైనా విద్యుత్ సమస్యలుంటే పెద్దకొడప్గల్ జేఎల్ఎం, సిబ్బంది వచ్చి పరిష్కరిస్తారన్నా రు. నెల రోజుల క్రితం జేఎల్ఎం బదిలీ అ య్యారని, అప్పటినుంచి ఏ అధికారి స్పందించడం లేదని పేర్కొన్నారు. ఎవరిని అడిగినా ఎల్సీ ఇవ్వడం లేదన్నారు. వారం రో జుల వ్యవధిలో రెండు రోజులు గ్రామంలో కరంటు లేక ఇబ్బందిపడ్డామన్నారు. జేఎల్ఎంను నియిమించి విద్యుత్ సమస్యను పరిష్కరించాలని కోరారు.
పంచాయతీ కార్యదర్శి హత్య
పిట్లం : చిన్నకొడప్గల్ గ్రామ పంచాయతీ కార్యదర్శి ధరావత్ కృష్ణ (28) అనే పంచాయతీ కార్యదర్శి హత్యకు గురయ్యారు. స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. రూం తండాకు చెందిన దరావత్ కృష్ణ చిన్నకొడప్గల్ గ్రామ పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్నాడు. మూడు రోజుల క్రితం ఇంట్లో నుంచి బయటకు వెళ్లి ఇంటికి తిరిగిరాలేదు. దీంతో అతడి తండ్రి గోప్యానాయక్ శుక్రవారం పిట్లం పోలీసులకు పిర్యాదు చేశాడు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. గాలింపు చేపట్టగా శనివారం చిన్నకొడప్గల్ శివారులోని రెడ్డి చెరువులో మృతదేహం లభించింది. మృతదేహాన్ని బయటకు తీసిచూడగా తలపై, శరీరంపై గాయాలు ఉన్నాయి. అతడిని హత్య చేసి చెరువు పడేసి ఉంటారని అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

నేడు కూచిపూడి కళాక్షేత్రం వార్షికోత్సవం

నేడు కూచిపూడి కళాక్షేత్రం వార్షికోత్సవం