
ఘనంగా ఈద్ ఉల్ అజ్ హా
కామారెడ్డి టౌన్: జిల్లాలో శనివారం బక్రీద్ పండుగను ముస్లింలు ఘనంగా జరుపుకున్నారు. ఈద్గాలకు వెళ్లి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. కామారెడ్డి పట్టణంలోని ఆర్డీవో కార్యాలయం ముందు, పెద్దమ్మ ఆలయం సమీపంలోని ఈద్గా వద్ద ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొని ఒకరికొకరు ఆలింగనం చేసుకుని పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఆర్డీవో కార్యాలయం వద్దనున్న ఈద్గాలో ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ ప్రసంగించారు. త్యాగాలకు సార్థకత చేకూరుతుందనే సందేశాన్ని బక్రీద్ పండుగ విశ్వమానవాళికి అందిస్తుందన్నారు. సకల మతవిశ్వాసాలను, సంప్రదాయాలను గౌరవిస్తూ రాష్ట్రంలో, దేశంలో పాలన కొనసాగాలని ఆకాంక్షించారు.