
భద్రత ఏర్పాట్ల పరిశీలన
బక్రీద్ పర్వదినం సందర్భంగా జిల్లా కేంద్రంలోని ఈద్గాలు, మసీదుల వద్ద భద్రత ఏర్పాట్లను ఎస్పీ రాజేశ్ చంద్ర పరిశీలించారు. అర్ఫత్ మసీద్ ఈద్గా, ఇస్లాంపురా, గొల్లవాడ, ఇందిరానగర్ కాలనీ, వాంబే కాలనీ, సైలానీ బాబా కాలనీ, బతుకమ్మ కుంట, అశోక్నగర్, విద్యానగర్ ప్రాంతాల్లోని మసీదుల వద్ద బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించి సిబ్బందికి సూచనలు ఇచ్చారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ముస్లింలకు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. పండుగలను సంతోషకరమైన, ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలన్నారు. ఒకరి మత సంప్రదాయాలను మరొకరు గౌరవించుకోవాలని సూచించారు. ఆయన వెంట ఏఎస్పీ చైతన్యరెడ్డి, పట్టణ ఎస్హెచ్వో చంద్రశేఖర్రెడ్డి, సిబ్బంది ఉన్నారు.