
పేదలందరికీ ఇళ్లు మంజూరు చేస్తాం
భిక్కనూరు : గూడు లేని నిరుపేదలందరికీ ప్రభు త్వం ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తుందని ప్రభు త్వ సలహాదారు షబ్బీర్ అలీ పేర్కొన్నారు. శుక్రవా రం భిక్కనూరులోని గిద్ద హరిజనవాడ, కుమ్మరిగ ల్లి, పాత హరిజన వాడలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ముగ్గు పోశారు. అనంతరం లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ లబ్ధిదారులు వెంటనే ఇళ్ల నిర్మాణం చేపట్టాలని సూచించారు. గత ప్రభుత్వం నిరుపేద ల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించిందని ఆరోపించా రు. మండల కేంద్రంలో డబుల్ బెడ్ రూం ఇళ్లు ని ర్మించినప్పటికీ లబ్ధిదారులకు కేటాయించకపోవ డం సిగ్గు చేటన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదల సంక్షేమానికి ఎన్నో పథకాలను అమలు చేస్తోందన్నారు. రేషన్ షాపుల ద్వారా లబ్ధిదారులకు సన్నబి య్యం పంపిణీ చేస్తున్నామన్నారు. రాష్ట్రం అప్పుల్లో ఉన్నప్పటికీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను దశలవారీగా అమలు చేస్తున్నామన్నారు. ఎవరికి ఎ లాంటి ఇబ్బందులు వచ్చినా తాను అండగా ఉంటా నని హామీ ఇచ్చారు. ప్రాణహిత చేవెళ్ల పథకం ద్వా రా మండలానికి సాగునీరు అందిస్తామన్నారు. కా ర్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రకాంత్రెడ్డి, పీసీసీ కార్యదర్శి ఇంద్రకరణ్రెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు భీంరెడ్డి, నాయకులు సుదర్శన్, దయాకర్రెడ్డి, రేఖ, లింబాద్రి, శ్రీరామ్ వెంకటేష్, సుధాకర్రెడ్డి నరేందర్రెడ్డి, భూమయ్య, నరసింహారెడ్డి, మోహన్రెడ్డి, మైపాల్రెడ్డి, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ