
నాణ్యతకు, మాకు ఏ సంబంధమూ లేదు
బీబీపేట : ‘‘విత్తనాల నాణ్యత మేము నియంత్రించ లేని విషయం. ఎలాంటి కష్టనష్టాలకు బాధ్యులం కాము’’ అంటూ బీబీపేటకు చెందిన ఓ విత్తన దుకా ణం నిర్వాహకుడు బిల్లుపై ముద్రించాడు. శుక్రవా రం తనిఖీలకు వెళ్లిన బృందం దీనిని చూసి ఆశ్చర్య పోయింది. సదరు దుకాణం నిర్వాహకుడిపై ఏడీఐ అపర్ణ, ఎస్సై ప్రభాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రై తులకు అమ్మే విత్తనాలకు దుకాణాదారులే బాధ్యు లని పేర్కొన్నారు. నకిలీ విత్తనాలను విక్రయిస్తే లై సెన్స్లు రద్దు చేస్తామని ఏడీఏ అపర్ణ హెచ్చరించారు.
మండల కేంద్రంలోని ఫర్టిలైజర్, సీడ్స్ దుకా ణాలను అధికారులు తనిఖీ చేశారు. చాలావరకు వి త్తనాలను తీసుకువచ్చిన కంపెనీల నుంచి బిల్లులు లేకపోవడం, రైతులకు ఎలాంటి రసీదులు ఇవ్వకపోవడాన్ని గుర్తించారు. బిల్లులు ఇవ్వకుండానే విత్తనాలు, మందులను రైతులకు విక్రయిస్తుండడంపై ఏడీఏ అపర్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. బిల్లులు, రిజిస్టర్లు సరిగ్గా చూపించని దుకాణాలకు నోటీసులు ఇచ్చారు. దుకాణాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని ఎస్సై సూచించారు.
బిల్లుపై ముద్రించిన విత్తన దుకాణదారు
ఆగ్రహం వ్యక్తం చేసిన అధికారులు