ప్రకృతిని కాపాడుకోవాలి | - | Sakshi
Sakshi News home page

ప్రకృతిని కాపాడుకోవాలి

Jun 6 2025 6:17 AM | Updated on Jun 6 2025 6:17 AM

ప్రకృతిని కాపాడుకోవాలి

ప్రకృతిని కాపాడుకోవాలి

దోమకొండ: ప్రకృతిని కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని జిల్లా అటవీశాఖ అధికారి నిఖిత పేర్కొన్నారు. గురువారం మండల కేంద్రంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ర్యాలీ నిర్వహించారు. ప్రజలకు పర్యావరణంపై అవగాహన కల్పించారు. మొక్కలు నాటడం, ప్లాస్టిక్‌ వినియోగం తగ్గించడం, నీటిని పరిరక్షించడం తదితర విషయాలను వివరించారు. 170 కుటుంబాలకు మొక్కలను అందజేశారు. కార్యక్రమంలో అటవీశాఖ రేంజ్‌ ఆఫీసర్‌ దివ్య, తహసీల్దార్‌ సుధాకర్‌, ఎంపీడీవో ప్రవీణ్‌కుమార్‌, పంచాయతీ కార్యదర్శి యాదగిరి, మాజీ జెడ్పీటీ తిర్మల్‌గౌడ్‌, మాజీ సర్పంచ్‌ అంజలి, గడికోట ట్రస్టు మేనేజర్‌ బాబ్జీ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement