
కరపత్రాల ఆవిష్కరణ
బాన్సువాడ: పట్టణంలో గురువారం లీగల్ సర్వీసెస్ అథారిటీ నిర్వహణ కరపత్రాలను బా న్సువాడ టౌన్ సీఐ అశోక్ ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. కుటుంబ తగాదాలు, సీనియర్ సిటిజన్, గ్రామాల్లో జ రిగే ఇతర తగాదాలను మండల లీగల్ సర్వీస్ అథారటీ ద్వారా పరిష్కరించుకోవచ్చని అన్నా రు. వలంటీర్లు ఉచితంగా న్యాయ సలహాలు, సూచనలు ఇస్తారని అన్నారు. కమ్యూనిటి మీడియేషన్ వలంటీర్లు రామకృష్ణరెడ్డి, అయ్యా ల సంతోష్, అహ్మద్ హుస్సెన్ ఉన్నారు.
మూఢ నమ్మకాలను వీడాలి
లింగంపేట(ఎల్లారెడ్డి):గ్రామీణ ప్రాంతాల్లో ప్ర జలు మూఢ నమ్మకాలను వీడాలని కళా బృందం సభ్యులు వివరించారు. లింగంపేట బ స్టాండ్ ఆవరణలో గురువారం తెలంగాణ సాంస్కృతిక కళా బృందం సభ్యులు జానపద గే యాలు,ఆట పాటలతో ప్రయాణికులకు అవ గాహన కల్పించారు.సభ్యులు మహేందర్, ర మేశ్రావు, విఠల్రెడ్డి,నాగరాజు,రాము, లక్ష్మినారాయణ,పోశెట్టి,కాశీరాం,దివ్యశ్రీ, సవిత, లత, శిల్ప,ప్రశాంత్, నరేష్ తదితరులు పాల్గొన్నారు.
కెపాసిటర్లు బిగించుకోవాలి
భిక్కనూరు: రైతులు స్టార్టర్ బాక్స్ల వద్ద కెపాసిటర్లను తప్పనిసరిగా బిగించుకోవాలని ట్రాన్స్కో ఏడీఈ సుదర్శన్రెడ్డి అన్నారు. మండలంలోని జంగంపల్లి గ్రామంలో గురువారం పొలంబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ.. కెపాసిటర్ల వల్ల పంపు మోటర్లకు ఎంతో మేలు కలుగుతుందన్నారు. విద్యుత్ సిబ్బంది రైతులకు సేవ చేసేందుకు 24 గంటలు అందుబాటులో ఉంటారని, విద్యుత్ సమస్యల పరిష్కారం కోసం 1912 టోల్ఫ్రీ నెంబర్కు ఫోన్ చేయవచ్చన్నారు. నార్త్ ఏరియా ఏఈ బాలాజీ, ట్రాన్స్కో సిబ్బంది తిరుపతిగౌడ్,లింగం, తదితరులు పాల్గొన్నారు.
రైతులకు అందుబాటులో యూరియా
లింగంపేట(ఎల్లారెడ్డి): మండల కేంద్రంలోని ప్రాథమిక సహకార సంఘంలో యూరియా నిల్వలు అందుబాటులో ఉన్నట్లు సహకార సంఘం చైర్మన్ దేవేందర్రెడ్డి గురువారం తెలిపారు. వర్షాకాలం ఖరీఫ్ సీజన్లో పంటల సాగు చేస్తున్న రైతుల కోసం ముందస్తుగా యూరియాను అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. లింగంపేట సహకార సంఘం పరిధిలోని భవానిపేట 900 బస్తాలు, పోతాయిపల్లి 450 బస్తాలు, లింగంపేటలో 1250 బస్తాలు రైతులకు యూరియా అందుబాటులో ఉంచినట్లు ఆయన పేర్కొన్నారు. పంటల సాగుకు ముందస్తుగా అందుబాటులో ఉంచిన యూరియాను రైతులు తీసుకెళ్లాలని సూచించారు.
బ్రాండెడ్ విత్తనాలను విక్రయించాలి
ఎల్లారెడ్డి: ఫర్టిలైజర్ దుకాణాలలో నాణ్యమైన బ్రాండెడ్ విత్తనాలను మాత్రమే విక్రయించాలని సీఐ రవీందర్నాయక్ అన్నారు. పట్టణంలోని ఫర్టిలైజర్ దుకాణాలను గురువారం ఆయన ఏవో నయిమోద్దిన్తో కలిసి పరిశీలించారు. దుకాణాల రిజిస్టర్లను తనిఖీ చేశారు. స్టాక్ వివరాల బోర్డును ప్రదర్శించాలని, నకిలీ విత్తనాలను విక్రయించవద్దని దుకాణాదారులకు సూచించారు. నకిలీ విత్తనాలు విక్రయిస్తే కేసులు నమోదు చేస్తామన్నారు.

కరపత్రాల ఆవిష్కరణ

కరపత్రాల ఆవిష్కరణ

కరపత్రాల ఆవిష్కరణ