అక్రమ రవాణా నియంత్రణకు చర్యలు | - | Sakshi
Sakshi News home page

అక్రమ రవాణా నియంత్రణకు చర్యలు

Jun 5 2025 7:34 AM | Updated on Jun 5 2025 7:34 AM

అక్రమ రవాణా నియంత్రణకు చర్యలు

అక్రమ రవాణా నియంత్రణకు చర్యలు

కామారెడ్డి క్రైం: పశువుల అక్రమ రవాణా నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నామని ఎస్పీ రాజేశ్‌ చంద్ర తెలిపారు. ఇందుకోసం జిల్లాలో ఏడోచోట్ల సరిహద్దు చెక్‌పోస్టులను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. మాచారెడ్డి మండలంలోని ఘన్‌పూర్‌, భిక్కనూరు మండలంలోని టోల్‌ప్లాజా, బస్వాపూర్‌ చెక్‌పోస్టులను బుధవారం ఆయన తనిఖీ చేశారు. పశువుల అక్రమ రవాణాపై నిరంతరం నిఘా పెట్టాలని అధికారులు, సిబ్బందికి సూచించారు. ప్రతి వాహనాన్ని తనిఖీ చేయాలన్నారు. ఎవరు చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడినా, సోషల్‌ మీడియాలో రెచ్చగొట్టే, ద్వేషపూరితమైన పోస్టులు పెట్టినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా ప్రశాంత వాతావరణంలో పండుగలు జరుపుకోవాలని ప్రజలకు సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement