మొక్కలు నాటడానికి స్థలాలను గుర్తించాలి | - | Sakshi
Sakshi News home page

మొక్కలు నాటడానికి స్థలాలను గుర్తించాలి

Jun 5 2025 7:34 AM | Updated on Jun 5 2025 7:34 AM

మొక్కలు నాటడానికి స్థలాలను గుర్తించాలి

మొక్కలు నాటడానికి స్థలాలను గుర్తించాలి

రాజంపేట : వనమహోత్సవంలో భాగంగా మండలవ్యాప్తంగా మొక్కలు నాటడానికి స్థలాలను గుర్తించాలని ఫీల్డ్‌ అసిస్టెంట్లకు ఎంపీడీవో రఘురాం సూచించారు. అలాగే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం త్వరగా చేపట్టేలా చూడాలన్నారు. మండల పరిషత్‌ కార్యాలయంలో బుధవారం పంచాయతీ కార్యదర్శులు, ఫీల్డ్‌ అసిస్టెంట్లతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా గ్రామాల్లో పారిశుధ్య పనులు చేపట్టాలని పంచాయతీ కార్యదర్శులను ఆదేశించారు. బడిబాట కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో ఇన్‌చార్జి ఏపీవో అన్నపూర్ణ, ఎంఈవో పూర్ణచందర్‌రావు, టీఏ భాస్కర్‌, రాజులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement