
సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి
మాచారెడ్డి: ప్రతి గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని మాచారెడ్డి ఎస్ఐ అనిల్ సూచించారు. ఈమేరకు పాల్వంచ మండలం భవానిపేట గ్రామంలో గ్రామస్తులు ఏర్పాటుచేసిన సీసీ కెమెరాలు బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చోరీలు చైన్ స్నాచింగ్ కిడ్నాప్ లు జరగకుండా ఉండాలంటే తప్పనిసరి సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో గ్రామస్తులు నర్సింలు రమేశ్గౌడ్, సమరసింహారెడ్డి, పరశురాంగౌడ్ తదితరులున్నారు.
వాహనాల తనిఖీ
లింగంపేట(ఎల్లారెడ్డి): మండలంలోని ముస్తాపూర్ గ్రామ శివారులో బుధవారం పోలీసులు వాహనాల తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా వాహనాలపై పెండింగ్ ఉన్న చాలన్లను చెల్లించాలని సూచించారు. లేదంటే వాహనాలను సీజ్ చేస్తామని హెచ్చరించారు. వాహన చోదకులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. వాహనాల ధ్రువపత్రాలు లేనివారికి, హెల్మెట్ ధరించని పలువురికి జరిమానాలు విధించినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఏఎస్సై ప్రకాష్నాయక్, సిబ్బంది పాల్గొన్నారు.