
బోరుబావుల రైతుల ముందుచూపు
మద్నూర్(జుక్కల్): మద్నూర్ మండలంలో బోరు బావుల రైతులు రెండు పంటలు తీసి లాభాలు పొందాలనే ఉద్దేశ్యంతో పత్తి విత్తనాలు సాగు ప్రారంభించారు. జిల్లాలో మద్నూర్లోనే సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాలు, మద్దతు ధర ఉంది. దీంతో రైతు లు పత్తి పంట వైపే మొగ్గు చూపుతున్నారు. ఈ సా రి వర్షాలు త్వరగానే మొదలవుతాయని బోరుబావుల రైతులు పత్తి పంట విత్తనాలు వేయడం మొదలు పెట్టారు. మండలంలోని పెద్ద తడ్గూర్, అంతాపూర్, సోమూర్, దన్నూర్ తదతర గ్రామాల శివారులో రైతులు పత్తి విత్తనాలను విత్తుకోవడంలో బిజీగా మారారు. పత్తి సంవత్సరం పంట అని, ముందుగా వేయడంతో రెండు పంటలు తీసుకునే అవకాశం ఉందని రైతులు తెలిపారు. జిల్లాలో గతేడాది 33,657 ఎకరాల్లో పత్తి పంట సాగు చేయగా ఈ సారి పంట విస్తీర్ణం పెరిగే అవకాశాలు ఉన్నాయని వ్యవసాయ అధికారులు పేర్కొంటున్నారు. కాగా, గతేడాది పత్తిసాగు రైతులకు సిరులు కురిపించింది. పత్తి పంటకు ప్రభుత్వం మద్దతు రూ. 589 పెంచుతూ క్వింటాలుకు రూ. 8110 మద్దతు ధర ప్రకటించింది.
విత్తనాల ఎంపికలో అయోమయం
మార్కెట్లో ఎన్నో రకాల కంపెనీలకు చెందిన పత్తి విత్తనాలను వ్యాపారులు అందుబాటులో ఉంచారు. సీజన్ ప్రారంభం కావడంతో రైతులు దుకాణదారులు చెప్పిన పత్తి విత్తనాలనే కొనుగోలు చేస్తున్నారు. కొందరు వ్యాపారులు నాణ్యత లేని విత్తనాలు అంటగడుతున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం పత్తి విత్తనాలు అందిస్తే ఇబ్బందులు తప్పుతాయని రైతులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
నాణ్యమైన విత్తనాలు ముఖ్యం
లైసెన్స్లు కలిగిన దుకాణాల్లో మాత్రమే రైతులు విత్తనాలు తీసుకోవాలి. ప్రభుత్వం పత్తి విత్తనాలను అందించదు. బయ ట మార్కెట్లో విత్తనాలు తీసుకోని రిసిప్ట్ కచ్చితంగా తీసుకోవాలి. చాలా చోట్ల బోరుబావుల కింద పత్తి విత్తడం రైతులు ప్రారంభించారు. ఈ సారి పత్తి విస్తీర్ణం పెరిగి అవకాశం ఉంది.
–రాజు, ఏవో, మద్నూర్
విత్తనాలను ప్రభుత్వమే అందించాలి
పత్తి విత్తనాలను ప్రభుత్వమే అందించాలి. బ హిరంగ మార్కెట్లో ఎ న్నో రకాల పత్తి విత్తనా లు విక్రయిస్తున్నారు. ఏ విత్తనాలు అధిక దిగుబడి ఇస్తుందో తెలియని పరిస్థితి ఉంది. వ్యాపారులు సూచించిన పత్తి విత్తనాలు తీసుకొచ్చి విత్తుకున్నాను. వ్యవసాయ అధికారులు విత్తనాల ఎంపికపై సలహాలు అందించాలి.
– రాములు, పత్తి రైతు, అంతాపూర్
ముందే పత్తి పంట వేశాను
వర్షాలు కురియగానే పత్తి పంట వేశాను. బోరుబావులు ఉండడంతో పత్తికి తడులు అందించవచ్చు. రెండు పంటలు తీయాలని పత్తి పంట విత్తులు ముందే మొదలుపెట్టాం. ఇప్పుడు వేసిన పత్తి నవంబర్లో పూర్తి కాగా అనంతరం ఇతర పంటలు వేసుకునే అవకాశం ఉంటుంది. ఆరు ఎకరాల్లో పత్తి పంట వేశాను.
– మష్ణాజీ, పత్తి రైతు, అంతాపూర్
మద్నూర్ మండలంలో
రెండు పంటలతో లబ్ధి పొందాలని
పత్తి సాగు ప్రారంభం
ప్రభుత్వమే విత్తనాలను
అందించాలని డిమాండ్
ప్రైవేటు మార్కెట్లో పలు రకాల
పత్తి విత్తనాలు

బోరుబావుల రైతుల ముందుచూపు

బోరుబావుల రైతుల ముందుచూపు

బోరుబావుల రైతుల ముందుచూపు

బోరుబావుల రైతుల ముందుచూపు