
బక్రీద్ పండగకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలి
ఎల్లారెడ్డిరూరల్: బక్రీద్ పండగకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాస్రావు అన్నారు. బుధవారం ఎల్లారెడ్డిలో నిర్వహించిన అధికారుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బక్రీద్ పండగ సందర్భంగా పట్టణంలోని ఈద్గా వద్ద అన్ని ఏర్పాట్లు చేయాలని, విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగకుండా తగిన చర్యలను తీసుకోవాలని అన్నారు. కార్యక్రమంలో సీఐ రవీందర్నాయక్, ఎస్సై మహేశ్, మున్సిపల్ కమిషనర్ మహేష్కుమార్, గిర్దావార్ శ్రీనివాస్, ఎంపీడీవో ప్రకాష్, విద్యుత్ సిబ్బంది సిద్దార్థరెడ్డి తదితరులున్నారు.
ప్రశాంతంగా పండుగలు నిర్వహించుకోవాలి
మద్నూర్(జుక్కల్): రానున్న పండుగలను ప్రజలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని బిచ్కుంద సీఐ నరేశ్ సూచించారు. మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో బుధవారం శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు. బక్రీద్ పండుగ సందర్భంగా అందరూ కలిసి మెలసి శాంతియుతంగా జరుపుకోవాలని ఆయన అన్నారు. ఆయనతో పాటు ఎస్సై విజయ్ కోండ, పోలీసు సిబ్బంది, గ్రామస్తులు ఉన్నారు.

బక్రీద్ పండగకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలి