నైపుణ్యాభివృద్ధి కోసం.. | - | Sakshi
Sakshi News home page

నైపుణ్యాభివృద్ధి కోసం..

Jun 4 2025 12:41 AM | Updated on Jun 4 2025 12:41 AM

నైపుణ

నైపుణ్యాభివృద్ధి కోసం..

సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : విద్యార్థులలో నైపుణ్యాల ను అభివృద్ధి చేసి బతుకుబాట చూపాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ఐటీఐ కళాశాలలను అడ్వాన్స్‌డ్‌ టె క్నాలజీ సెంటర్‌(ఏటీసీ)లుగా అప్‌గ్రేడ్‌ చేస్తోంది. జి ల్లాలో ఇప్పటికే బిచ్కుంద, ఎల్లారెడ్డిలలోని ప్రభు త్వ ఐటీఐ కళాశాలలను ఏటీసీలుగా మార్చింది. మి గిలిన రెండు నియోజకవర్గాలలోనూ ఏటీసీల ఏ ర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. కాగా ఆ యా కళాశాలల్లో వివిధ కోర్సులలో ప్రవేశాలకోసం ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఈనెల 21 వరకు దరఖాస్తులను స్వీకరించనున్నారు.

దరఖాస్తు విధానం...

● పదో తరగతి/ఎనిమిదో తరగతి పాస్‌ అయిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. 2025 ఆగస్టు 1 నాటికి 14 ఏళ్ల వయసు కలిగి ఉండాలి. గరిష్ట వయోపరిమితి లేదు.

● ఒరిజినల్‌ సర్టిఫికెట్లను స్కాన్‌ చేసి ఆన్‌లైన్‌లో అప్లోడ్‌ చేయాల్సి ఉంటుంది. అభ్యర్థులు ఒకే దరఖాస్తు ద్వారా రాష్ట్రంలోని ఏదైనా ఐటీఐ/ఏటీసీకి వెబ్‌ ఆప్షన్లను ఎంచుకునే అవకాశం ఉంది. https://iti.telangana.gov.in వెబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ఫీజు వంద రూపాయలు చెల్లించాల్సి ఉంటుంద. ఆధార్‌ నంబర్‌, మొబైల్‌ నంబర్‌, మెయిల్‌ ఐడీ తప్పనిసరి ఇవ్వాలి. దరఖాస్తులో ఇచ్చిన సమాచారం మారితే సీటు రద్దయ్యే అవకాశం ఉంటుంది. ఎంపికై న అభ్యర్థుల రిజిస్టర్డ్‌ మొబైల్‌ నంబరుకు ఎస్‌ఎంఎస్‌ ద్వారా సమాచారం అందుతుంది.

మంచి భవిష్యత్తు ఉంటుంది

ప్రభుత్వం విద్యార్థులలో నై పుణ్యాలను పెంపొందించి ఉపాధి అవకాశాలను క ల్పించడానికి చర్యలు తీసు కుంటోంది. ఇందులో భా గంగా ఐటీఐ కళాశాలలను ఏటీసీలుగా మారుస్తోంది. అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీ సెంటర్‌లలో అందిస్తున్న కోర్సుల్లో చేరినవారికి మంచి భవిష్యత్‌ ఉంటుంది. విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి.

– ప్రమోద్‌కుమార్‌, ప్రిన్సిపల్‌, ఏటీసీ, బిచ్కుంద

ఏటీసీల్లోని కోర్సులు, సీట్ల వివరాలు..

బిచ్కుంద ఏటీసీలో మాన్యుఫాక్చరింగ్‌ ప్రాసెస్‌ కంట్రోల్‌ ఆటోమేషన్‌, ఇండస్ట్రియల్‌ రోబోటిక్స్‌ అండ్‌ డిజిటల్‌ మాన్యుఫాక్చరింగ్‌ టెక్నిషియన్‌ కోర్సులలో 40 సీట్ల చొప్పున ఉన్నాయి. ఏడాది వ్యవధిగల ఈ 2 కోర్సులకు పదో తరగతి చదివిన వారు అర్హులు.

ఆర్టిజన్‌ యూజింగ్‌ అడ్వాన్స్‌డ్‌ టూల్స్‌ కోర్సులో 20 సీట్లు ఉన్నాయి. పదో తరగతి చదివిన వారు అర్హులు. ఇదీ ఏడాది కోర్సే.

బేసిక్‌ డిజైనర్‌ అండ్‌ వర్చువల్‌ వెరిఫైర్‌ (మెకానిక్‌), అడ్వాన్స్‌డ్‌ సీఎస్‌సీ మిషనింగ్‌ టెక్నిషియన్‌, మెకానిక్‌ ఎలక్ట్రిక్‌ వెహికిల్స్‌ కోర్సులలో 24 చొప్పున సీట్లు ఉన్నాయి. రెండేళ్ల కాలవ్యవధిగల ఈ కోర్సులకు పదో తరగతి చదివినవారు అర్హులు.

ఎల్లారెడ్డి ఏటీసీలో కంప్యూటర్‌ ఆపరేటర్‌ అండ్‌ ప్రోగ్రామింగ్‌ అసిస్టెంట్‌ కోర్సులో 19 సీట్లు ఉన్నాయి.

ప్రైవేట్‌ కళాశాలల్లో..

ఎల్లారెడ్డిలోని ఆదిత్య ఐటీఐ కళాశాలలో ఫిట్టర్‌ కోర్సులో 20 సీట్లు, డీజిల్‌ మెకానిక్‌ కోర్సులో 24 సీట్లున్నాయి.

కామారెడ్డిలోని ఇంజినీర్స్‌ ఐటీఐ కళాశాలలో ఎలక్ట్రీషియన్‌ కోర్సులో 20 సీట్లు ఉన్నాయి.

కామారెడ్డిలోని శ్రావణి ఐటీఐ కళాశాలలో ఎలక్ట్రీషియన్‌ కోర్సులో 120 సీట్లు, ఫిట్టర్‌ కోర్సులో 20 సీట్లు, డీజిల్‌ మెకానిక్‌ కోర్సులో 48 సీట్లు ఉన్నాయి.

బాన్సువాడలోని శ్రీ బాలాజీ ఐటీఐ కళాశాలలో ఎలక్ట్రీషియన్‌ కోర్సులో 80 సీట్లు, డీజిల్‌ మెకానిక్‌ కోర్సులో 24 సీట్లు, రేడియాలజీ టెక్నిషియన్‌ కోర్సులో 20 సీట్లు, సియూంగ్‌ టెక్నాలజీలో 40 సీట్లు ఉన్నాయి.

బిచ్కుంద, ఎల్లారెడ్డి ఐటీఐ కాలేజీలను ఏటీసీలుగా మార్చిన సర్కారు

ఆయా కోర్సుల్లో ప్రవేశాలకు

నోటిఫికేషన్‌ జారీ

జిల్లాలో మరో రెండు ఏటీసీల

ఏర్పాటు కోసం ప్రతిపాదనలు

నైపుణ్యాభివృద్ధి కోసం..1
1/1

నైపుణ్యాభివృద్ధి కోసం..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement