యోగా డే ను విజయవంతం చేయాలి | - | Sakshi
Sakshi News home page

యోగా డే ను విజయవంతం చేయాలి

Jun 4 2025 12:41 AM | Updated on Jun 4 2025 12:41 AM

యోగా

యోగా డే ను విజయవంతం చేయాలి

కామారెడ్డి అర్బన్‌ : ఈనెల 21 న నిర్వహించే యోగా దినోత్సవాన్ని విజయవంతం చేయా లని ఆర్డీవో వీణ సూచించారు. అంతర్జాతీ య యోగా దశాబ్ది వేడుకల్లో భాగంగా మంగళవారం ఆయుష్‌ ఆధ్వర్యంలో పతంజలి యోగా అసోసియేషన్‌ సహకారంతో జిల్లా కేంద్రంలో యోగా వాక్‌ నిర్వహించారు. ము న్సిపల్‌ కార్యాలయం నుంచి రైల్వే స్టేషన్‌ వ రకు వాక్‌ సాగింది. ఇందిర చౌక్‌లో మానవహారం నిర్వహించి యోగా నినాదాలు చేశా రు. ఈ సందర్భంగా ఆర్డీవో మాట్లాడుతూ యోగాతో మానసిక, శారీరక దృఢత్వం పెరుగుతుందన్నారు. రోజూ యోగాసాధన చేయడం ద్వారా సంపూర్ణ ఆరోగ్యం సాధ్యమవుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆయుష్‌ డీపీఎం ఆకుల శ్రీకాంత్‌, వైద్యాధికారులు వెంకటేశ్వర్లు, దేవయ్య, నీలిమ, వి జయ, చైతన్య, విజయలక్ష్మి, నహీద, యోగా గురువులు అంజయ్య గుప్తా, యెల్లంకి సుద ర్శన్‌ తదితరులు పాల్గొన్నారు.

8న హైదరాబాద్‌ నెక్లెస్‌ రోడ్డులో పరుగు పోటీలు

కామారెడ్డి అర్బన్‌: సొసైటీ ఫర్‌ తెలంగాణ రన్నర్స్‌ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో 8న హైదరాబాద్‌ నెక్లెస్‌ రోడ్డులో పరుగు పోటీలు నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని జిల్లా యువజన, క్రీడల అధికారి జగన్నాథన్‌ ఒక ప్రకటనలో తెలిపారు. 3, 5, 21 కిలోమీటర్ల పరుగు పోటీలు ఉంటాయని పేర్కొన్నారు. ఆసక్తిగల అథ్లెట్లు 98494 93010 నంబర్‌లో సంప్రదించాలని సూచించారు.

‘ప్రభుత్వ బడులలో చేర్పించాలి’

కామారెడ్డి టౌన్‌: పిల్లలను ప్రభుత్వ బడుల లో చేర్పించాలని డీఈవో రాజు తల్లిదండ్రులను కోరారు. తెలంగాణ ప్రాంత ఉపాధ్యా య సంఘం ఆధ్వర్యంలో ముద్రించిన ‘ప్రభుత్వ బడులలో పిల్లలను చేర్పించండి –సంస్కారంతో పాటు నాణ్యమైన విద్యను పొందండి‘ బడిబాట పోస్టర్‌లను మంగళవారం జిల్లాకేంద్రంలోని డీఈవో కార్యాలయంలో ఆవిష్కరించారు. ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి కృషి చేస్తున్న తపస్‌ జిల్లా శాఖను డీఈవో అభినందించారు. కార్యక్ర మంలో తపస్‌ జిల్లా అధ్యక్షుడు పుల్గం రాఘవరెడ్డి, ప్రతినిధులు రామచంద్రం, లక్ష్మీపతి, ఆంజనేయులు, రాజశేఖర్‌, సత్యనారాయణ, పవన్‌ కుమార్‌, దత్తాచారి, సంతోష్‌ తదితరులు పాల్గొన్నారు.

హెల్త్‌కేర్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సు మంజూరు

కామారెడ్డి అర్బన్‌ : జిల్లాకేంద్రంలోని ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాలకు బీఎస్సీ హెల్త్‌కేర్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సు మంజూరైందని ప్రిన్సిపల్‌ విజయ్‌కుమార్‌ తెలిపారు. కళాశాలలో ఇప్పటికే డిగ్రీలో బీఎస్సీ ఫిజికల్‌ సైన్స్‌, కంప్యూటర్‌ సైన్స్‌, లైఫ్‌ సైన్స్‌, ఆనర్స్‌ కోర్సులున్నాయని పేర్కొన్నారు. ఈ విద్యా సంవత్సరం నుంచి బీఎస్సీ హెల్త్‌కేర్‌ మేనేజ్‌మెంట్‌ 60 సీట్లతో ప్రారంభమవుతుందని తెలిపారు. ఈ కోర్సులో చేరాలనుకునేవారు దోస్త్‌లో ఈనెల 8 వరకు(కళాశాల కోడ్‌: 5009) ఆప్షన్‌ ఇవ్వాలని సూచించారు.

నేడు విగ్రహ ప్రతిష్ఠాపన

బిచ్కుంద: మండల కేంద్రంలోని తక్కడ్‌పల్లి రోడ్డులో 300 ఏళ్ల నాటి పురాతన శివాలయ పునర్నిర్మాణం పూర్తయ్యింది. బుధవారం విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం నిర్వహించనున్నారు. సుమారు 150 ఏళ్లుగా పూజలకు నోచుకోని ఆలయానికి పూర్వ వైభవం తీసుకురావడానికి బిచ్కుందకు చెందిన జంగం నాగరాజ్‌ ముందుకు వచ్చారు. రూ. 40 లక్షల సొంత డబ్బులతో ఆలయాన్ని పునర్నిర్మించారు. గర్భగుడిలో ఆరడుగుల శిల్పాలున్నాయి. వాటిని అలాగే ఉంచి పక్కనుంచి కొత్తగా గోడలను నిర్మించారు. బుధవారం నుంచి మూడు రోజులపాటు విగ్రహ ప్రతిష్ఠాపన ఉత్సవాలు నిర్వహిస్తామని జంగం నాగరాజ్‌ తెలిపారు. బండాయప్ప మఠం పీఠాధిపతి శ్రీసోమాయప్ప స్వామీజీ చేతుల మీదుగా కార్యక్రమాలు సాగుతాయన్నారు.

యోగా డే ను  విజయవంతం చేయాలి 
1
1/2

యోగా డే ను విజయవంతం చేయాలి

యోగా డే ను  విజయవంతం చేయాలి 
2
2/2

యోగా డే ను విజయవంతం చేయాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement