
బక్రీద్ను ప్రశాంతంగా జరుపుకోవాలి
కామారెడ్డి క్రైం : బక్రీద్ పండుగను శాంతియుతంగా జరుపుకోవాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సూచించా రు. ఈనెల 7న బక్రీద్ నేపథ్యంలో మంగళవారం క లెక్టరేట్లో ముస్లిం మత పెద్దలు, వివిధ శాఖల అధికారులతో శాంతి కమిటీ సమావేశాన్ని నిర్వహించా రు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట ప్రణాళికతో ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. శాంతి భ ద్రతలకు విఘాతం కలిగించే వ్యక్తులపై కఠిన చర్య లు తీసుకుంటామన్నారు. అవసరమైతే పీడీ యాక్ట్ నమోదు చేస్తామని హెచ్చరించారు. ఎక్కడైనా ఏదైనా సమస్య ఉంటే పోలీసులకు సమాచారం ఇ వ్వాలని సూచించారు. గోవుల అక్రమ రవాణా జరగకుండా చెక్పోస్టులను ఏర్పాటు చేయాలని పోలీ సు శాఖకు సూచించారు. గోవులను, వాహనాలను సీజ్ చేసిన సందర్భాల్లో గోవులను గోశాలకు తరలించడం, వాటికి ఆహారం అందించడం లాంటివి మున్సిపల్ శాఖ చూడాలన్నారు. సోషల్ మీడియా లో వచ్చే వార్తల విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సమావేశంలో ఎస్పీ రాజే శ్ చంద్ర, అదనపు కలెక్టర్ విక్టర్, ఏఎస్పీ చైతన్యరె డ్డి, ఆర్డీవో వీణ, శాఽఖల అధికారులు పాల్గొన్నారు.