
అనారోగ్యంతో ఒకరు.. నీట మునిగి మరొకరు..
తిమ్మారెడ్డి గ్రామానికి చెందిన ఐతె సామెల్ దంపతులకు ఇద్దరు కుమారులు. మతిస్థిమితం సరి గ్గాలేని పెద్ద కుమారుడు సాయిబాబు నాలుగేళ్ల క్రితం అనారోగ్యంతో మరణించాడు. చిన్న కొడు కు నవీన్ బైక్ మెకానిక్గా పనిచేస్తూ కుటుంబాని కి ఆసరాగా ఉంటున్నాడు. అతడైనా వృద్ధాప్యంలో ఆసరాగా ఉంటాడనుకుంటే.. సోమవారం ని జాంసాగర్ బ్యాక్వాటర్లో మునిగి చనిపోయా డు. ఇలా ఇద్దరు కుమారులు కళ్లముందే మరణించడంతో సామెల్ దంపతులకు తీరని గర్భశోకం మిగిలింది.
తిమ్మారెడ్డిలో విషాదఛాయలు
వేర్వేరు కారణాలతో కొద్దిరోజుల వ్యవధిలో తిమ్మారెడ్డి గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు మృత్యువాతపడ్డారు. పైచదువుల కోసం అమెరికాకు వెళ్లిన గోవర్ధన్(28).. అక్కడ గతనెల 29న అనుమానాస్పద స్థితిలో మరణించాడు. సోమవారం స్నేహితులతో కలిసి ఈతకు వెళ్లిన నవీన్ (23) నిజాంసాగర్ బ్యాక్ వాటర్లో నీట మునిగి మృతి చెందాడు. కొద్ది గంటల తేడాలోనే ఇద్దరు యువకుల మృతదేహాలు గ్రామానికి చేరుకున్నాయి. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.