
లంపి స్కిన్ సోకిన ఆవులకు వ్యాక్సినేషన్
కామారెడ్డి టౌన్: జిల్లా కేంద్రంలో సంచరిస్తున్న పశువులకు లంపి స్కిన్ వ్యాధి సోకి ఇతర మూగ జీవాలకు వ్యాప్తి చెందుతున్న ఘటనపై సోమవారం ప్రచురితమైన కథనానికి పశువైద్యశాఖ అధికారులు స్పందించారు. సోమవారం మండల పశువైద్యాధికారి రవికిరణ్ వీక్లీమార్కెట్, శివాలయం వద్ద ఆవులను పరిశీలించారు. లంపి స్కిన్ సోకిన ఆవులను గుర్తించి వాటికి చికిత్సతో పాటు వ్యాక్సిన్ వేశారు. మిగతా ఆవులను పరిశీలించారు. ఈ వ్యాధి వ్యాప్తి చెందకుండా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.
పాఠశాలలకు పుస్తకాల పంపిణీ
ఎల్లారెడ్డిరూరల్/లింగంపేట/నిజాంసాగర్ : ఎల్లారెడ్డి మండలం ప్రభుత్వ పాఠశాలలకు ఎంఈవో రాజులు సోమవారం పుస్తకాలను అందించారు. పాఠశాలలు ప్రారంభం కానున్న దృష్ట్యా మండల కేంద్రానికి పుస్తకాలు రావడంతో వాటిని మండలంలోని ప్రభుత్వ పాఠశాలలకు ఉపాధ్యాయుల ద్వారా అందించారు. . అలాగే లింగంపేట మండలంలోని ఆయా గ్రామాలకు చెందిన ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలకు ఎంఈవో షౌకత్అలీ పాఠ్య పుస్తకాలు పంపిణీ చేశారు. మండలంలోని ఆయా పాఠశాలలకు 21వేల పాఠ్య పుస్తకాలు వచ్చినట్లు తెలిపారు. నిజాంసాగర్ విద్యాశాఖ కార్యాలయంలో ఎంఈవో తిరుపతి రెడ్డి పాఠ్యపుస్తకాలు పంపిణీ చేశారు. 2025–26 విద్యాసంవత్సరానికి గాను ప్రభుత్వ పరంగా 80 శాతం మేర పాఠ్యపుస్తకాలను సరఫరా చేసిందని ఎంఈవో తిరుపతి రెడ్డి తెలిపారు. విద్యశాఖ కార్యాలయానికి వచ్చిన పుస్తకాలను పాఠశాలల వారిగా ప్రధానోపాధ్యాయులకు అందజేశామన్నారు. పాఠశాలలు ప్రారంభం కాగానే విద్యార్థులకు పుస్తకాలను అందించాలని ఉపాధ్యాయులకు ఎంఈవోలు సూచించారు.
బస్సు ఆపమన్నందుకు
ఒకరిపై దాడి
నవీపేట: మండలంలోని యంచ గ్రామంలో ఆర్టీసీ బస్సును ఆపమన్నందుకు డ్రైవర్ దురుసుగా ప్రవర్తించాడని బాధితులు సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. భైంసా నుంచి నిజామాబాద్కు వెళ్తున్న ఆర్టీసీ బస్సులో ఎక్కేందుకు యంచ మాజీ సర్పంచ్ కొట్టాల లహరి, ఆమె భర్త ప్రవీన్తోపాటు కుటుంబ సభ్యులు బస్టాండ్లో ఉన్నారు. బస్సును ఆపకపోవడంతో సర్పంచ్ భర్త ప్రవీన్ కొద్ది దూరం ముందుకు వెళ్లి బస్సుకు అడ్డుగా నిలబడ్డాడు. దీంతో ఆగ్రహానికి గురైన డ్రైవర్.. ప్రవీన్పై దాడికి పాల్పడి గాయపర్చాడు. దీంతో ప్రవీన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

లంపి స్కిన్ సోకిన ఆవులకు వ్యాక్సినేషన్