
రైతులకు నాణ్యమైన విత్తనాల పంపిణీ
బాన్సువాడ రూరల్: ప్రతి రైతుకు నాణ్యమైన విత్తనాల పంపిణీ చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర వ్యవసాయ సలహాదారు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్రెడ్డి అన్నారు. సోమవారం ఆయన స్టేట్ ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజు, సబ్కలెక్టర్ కిరణ్మయి, వ్యవసాయ అధికారులతో కలిసి పలువురు రైతులకు ఉచితంగా ఫౌండేషన్ సీడ్ పంపిణీ చేశారు. వర్షాకాలం సాగు కోసం వ్యవసాయశాఖ, రుద్రూర్లోని యూనివర్శిటీలు సంయుక్తంగా విత్తనాల పంపిణీ కార్యక్రమాన్ని చేపడుతున్నాయన్నారు. మండలానికి 10కేజీల 38 ప్యాకెట్ల వరివిత్తనాలు, 19 ప్యాకెట్లు మొక్కజొన్న విత్తనాలను ఆయా గ్రామాలకు చెందిన ఆదర్శరైతులకు అందజేశారు. విత్తనాల ద్వారా ఉత్పత్తి అయిన పంటను కొనుగోలు చేసి గ్రామీణ విత్తనోత్పత్తి కార్యాక్రమాన్ని బలోపే తం చేయనున్నారు. వ్యవసాయశాఖ ఏడీఏ అరుణ, ఎంఏవో ఫయాజుల్లా తదితరులు పాల్గొన్నారు.
రెండు గ్రామాల్లో ఎమ్మెల్యే పర్యటన
మండలంలోని నాగారం, చిన్న రాంపూర్ గ్రామాల్లో బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్రెడ్డి, స్టేట్ ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పోరేషన్ చైర్మన్ కాసుల బాలరాజుతో కలిసి పర్యటించారు. నాగారం గ్రామంలో రూ.5లక్షల ప్రభత్వ నిధులతో నిర్మించిన శ్రీకృష్ణ యాదవ సంఘం ఫంక్షన్ హాల్ను ప్రారంభించారు. అనంతరం చిన్న రాంపూర్ గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ బీరప్ప అక్కమహంకాళి మందిరంలో నిర్వహించిన కల్యాణమహోత్సవంలో పాల్గొని పూజలు చేశారు. కార్యక్రమంలో నాయకులు అంజిరెడ్డి, నర్సుగొండ, మొగులయ్య,రాచప్ప,పరిగె మోహన్రెడ్డి,పర్వుగొండ, కుర్మ గణేష్ తదితరులు పాల్గొన్నారు.