
ప్రతిభ చూపిన విద్యార్థులకు సన్మానం
దోమకొండ: మండల కేంద్రంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో సోమవారం ఇటీవల పదో తరగతిలో 100 శాతం ఫలితాలు సాధించగా వారిలో ఉత్తమ ప్రతిభతో జిల్లాలో ర్యాంకు సాధించిన విద్యార్థులను సన్మానించారు. పదవ తరగతి ఫలితాల్లో పాఠశాలకు చెందిన ఉడేం రాములు 558 మార్కులు, నందకిషోర్ 551 మార్కులు, సాయిచరణ్ 536 మార్కులు సాధించగా వారిని శాలువాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో పీఆర్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దామోదర్రెడ్డి, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు రాధలక్ష్మీ, ఉపాధ్యాయులు బాపురెడ్డి, వెంకటరెడ్డి, సుజాతరాణి, ప్రతాప్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
క్రమశిక్షణతో చదివితే మంచిర్యాంకులు
సాధించవచ్చు
తాడ్వాయి(ఎల్లారెడ్డి): ఉపాధ్యాయులు చెప్పిన ప్రకారం క్రమశిక్షణతో చదివినట్లయితే మంచిర్యాంకులు సాధించవచ్చని ప్రిన్సిపల్ సురేఖ అన్నారు. తాడ్వాయి బాలికల గురుకుల పాఠశాలలో చదివి ఎంసెట్లో ర్యాంకు సాధించిన విద్యార్థిని లక్కపాటి లాస్యను సోమవారం సన్మానించారు. కార్యక్రమంలో అధ్యాపకులు స్రవంతి, దివ్యవాణి, లాస్య తల్లి లక్కపాటి విజయ, మానవహక్కుల సంఘంజిల్లా ప్రధాన కార్యదర్శి ఎడవెల్లి సోమనాథ్, గంగామురళి, జశ్వంత్, సిబ్బంది పాల్గొన్నారు.
పాల్వంచ విద్యార్థులకు ప్రశంసలు
మాచారెడ్డి : తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సోమవారం కామారెడ్డి కలెక్టరేట్లో జరిగిన కార్యక్రమంలో జెడ్పీహెచ్ఎస్ పాల్వంచ విద్యార్థులు సాంస్కృతిక ప్రదర్శనతోపాటు సైన్స్ ఎగ్జిబిట్స్ను ప్రదర్శించి ప్రశంసలు పొందారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ విద్యార్థులను ప్రశంసించి జ్ఞాపికను అందించారని హెచ్ఎం గోవర్ధన్రెడ్డి తెలిపారు.