
కొత్త వంగడాలతో అధిక దిగుబడులు
రుద్రూర్: రైతులకు వ్యవసాయంలో అవసరమగు సలహాలు, సూచనలు ఇవ్వడంతో పాటు కొత్త వంగడాలను రూపొందించి రైతులకు అందించడానికి 1935లో రుద్రూర్ చెరుకు, వరి ప్రాంతీయ పరిశోధన స్థానాన్ని ఏర్పాటు చేశారు. కాలానుగుణంగా నాటి నుంచి ఎన్నో చెరుకు, వరి వంగడాలు రూపొందించి రైతులకు పరిచయం చేశారు. చీడ పీడలను తట్టుకుని అధిక దిగుబడులు సాధించే వంగడాల కోసం శాస్త్రవేత్తలు నిరంతరం కృషి చేస్తూనే ఉన్నారు. కొత్తగా తెగుళ్లను తట్టుకుని మంచి దిగుబడినిచ్చే చెరుకు, రెండు వరి వంగడాలను రూపొందించి రైతులకు అందుబాటులోకి తెచ్చారు. ఈ మూడు కొత్త వంగడాలు గూర్చి పరిశోధన కేంద్రం అధిపతి డాక్టర్ అంజయ్య ఆయన మాటల్లో..
రుద్రూర్ వ్యవసాయ శాస్త్రవేత్తల
బృందం కృషి
చెరుకు, వరిలో నూతన వంగడాలు సృష్టి