
రాష్ట్ర అవతరణ వేడుకలకు ఏర్పాట్లు
కామారెడ్డి క్రైం: తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలను సోమవారం నిర్వహించనున్నారు. ఇందుకోసం జిల్లాకేంద్రంలోని కలెక్టరేట్ ఆవరణలో అధికారులు ఏర్పాట్లు చేశారు. వేడుకలకు తెలంగాణ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేశ్రెడ్డి ముఖ్య అతిథిగా హాజరవుతారని అధికారులు తెలిపారు. ఆయన ఉదయం 9 గంటలకు జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారని పేర్కొన్నారు. అనంతరం జిల్లా పురోగతిపై ప్రసంగిస్తారన్నారు. ఆవిర్భావ వేడుకలలో సాంస్కృతిక కార్యక్రమాలు, అభివృద్ధి, సంక్షేమ పథకాలపై శకటాల ప్రదర్శన ఉంటాయని తెలిపారు. కార్యక్రమంలో ఇందిరమ్మ ఇళ్లు, రాజీవ్ యువ వికాసం లబ్ధిదారులకు మంజూరు పత్రాలు, భూ భారతి ఉత్తర్వులు అందిస్తారని పేర్కొన్నారు.
ముఖ్య అతిథిగా రానున్న టూరిజం
కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేశ్రెడ్డి

రాష్ట్ర అవతరణ వేడుకలకు ఏర్పాట్లు