సాగునీరు అందేదెప్పుడో? | - | Sakshi
Sakshi News home page

సాగునీరు అందేదెప్పుడో?

Jun 2 2025 1:18 AM | Updated on Jun 2 2025 1:18 AM

సాగునీరు అందేదెప్పుడో?

సాగునీరు అందేదెప్పుడో?

కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజక వర్గాలకు సాగు నీ రందించేందుకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్సా ర్‌ ప్రాణహిత–చేవెళ్ల పథకంలో భాగంగా 22వ ప్యాకేజీకి అనుమతులు ఇచ్చారు. భూంపల్లి చెరువును రిజర్వాయర్‌గా అభివృద్ధి చేసి, దాని ద్వారా ఆయా ప్రాంతాల్లో లక్షకు పైచిలుకు ఎకరాలకు సాగు నీరందించేందుకు పథకాన్ని ప్రారంభించారు. అయితే వైఎస్సార్‌ మరణానంతరం 22 వ ప్యాకేజీ పనులకు ఎన్నో ఆటంకాలు ఎదురయ్యాయి. భూసేకరణే పూర్తి స్థాయిలో జరగలేదు. ఇటీవల రూ.23 కోట్లు విడుదల చేసినా అవి ఏ మూలకూ సరిపోవు. ప్రాజెక్టు పూర్తికి కావలసిన నిధులు ఇవ్వడంలో ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి. సాగునీటి సమస్యతోనే ఈ ప్రాంత రైతులు బోర్లు తవ్వించి అప్పులపాలై ఆత్మహత్యలకు పాల్పడ్డారు. చాలామంది గల్ఫ్‌ దేశాలకు వలస వెళ్లారు. ఇప్పటికీ సాగునీటి సమస్యతో సేద్యం అనుకూలించకపోవడంతో రైతులు, రైతు కూలీ లు గల్ఫ్‌ దేశాలకు వెళుతున్నారు.

జుక్కల్‌ నియోజకవర్గంలోని పలు మండలాలకు సాగునీరందించేందుకు గత ప్రభుత్వంలో నాగమడుగు ఎత్తిపోతల పథకాన్ని చేపట్టా రు. అయితే పనులు మధ్యలోనే ఆగిపోయాయి. దాన్ని పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. పోచా రం ప్రాజెక్టు ఎత్తు పెంపు, పూడిక తొలగింపు ఎన్నికల హామీలుగానే మిగిలాయి. నిజాంసాగర్‌ ప్రాజెక్టులో పూడిక పెరిగి ఏడాదికేడాది నీటి నిల్వ సామర్థ్యం తగ్గిపోతోంది. సాగునీటి సమస్య పరిష్కారం కాకపోవడంతో అన్ని రంగా ల్లో వెనుకబడిపోతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement