వన మహోత్సవానికి సన్నద్ధం | - | Sakshi
Sakshi News home page

వన మహోత్సవానికి సన్నద్ధం

Jun 2 2025 1:18 AM | Updated on Jun 2 2025 1:18 AM

వన మహోత్సవానికి సన్నద్ధం

వన మహోత్సవానికి సన్నద్ధం

జిల్లాలో 12 లక్షల మొక్కలు

నాటాలన్నది లక్ష్యం

527 నర్సరీల్లో మొక్కలు సిద్ధం

సదాశివనగర్‌ : జిల్లాలో వన మహోత్సవాన్ని నిర్వహించేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు. ఇప్పటికే 527 నర్సరీల్లో 12 లక్షల మొక్కలను సిద్ధంగా ఉంచారు. ఈనెల మొ దటి వారంలో కురిసే వర్షాల ఆధారంగా వీ టిని ఆయా గ్రామాలలో నాటడానికి ప్రణాళికలు వెంటనే రూపొందించాలని డీఆర్‌డీవో సురేందర్‌ పంచాయతీ కార్యదర్శులకు ఆదే శాలు జారీ చేశారు.

ఎక్కడెక్కడ నాటుతారంటే..

నర్సరీల్లో పెంచుతున్న మొక్కలను ఎక్కడ ఎంత శాతం నాటాలన్న విషయమై ప్రభు త్వం స్పష్టత ఇచ్చింది. రహదారుల వెంట 20 శాతం, సామాజిక, ప్రభుత్వ స్థలాల్లో 20 శాతం, గట్ల వెంట 20 శాతం, ఇంటి ఆవరణ లో 15 శాతం, ఎకై ్సజ్‌శాఖ ఆధ్వర్యంలో 10 శాతం, చెరువులు, కుంటలు కట్టల వెంట 5 శాతం, ప్రభుత్వ స్థలాలకు కంచెల కోసం 10 శాతం మొక్కలు నాటాలని సూచించింది.

ఏ ఏ మొక్కలు...

గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా నర్సరీల్లో వివిధ రకాల మొక్కలను పెంచుతున్నారు. గుల్‌మోహర్‌, టెకోమా, సీమతంగెడు, రేల, కానుగ, స్పాథోడియా, నల్లమద్ది, సీతాఫలం, గన్నేరు, కాగితం, ఈత, వెదు రు, మల్లె, మందారం, విరజాజి, గులాబీ, గోరింట, జామ, ద్రాక్ష, అల్లనేరెడు, బొప్పా యి, మునగ వంటి మొక్కలు పెంచుతున్నారు.

లొకేషన్‌లను గుర్తించాలని సూచించాం

జిల్లావ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీల పరిధిలో మొక్కలు నాటేందుకు లొకేషన్‌లను గుర్తించాలని పంచాయతీ కార్యదర్శులకు సూచించాం. దాదాపుగా అన్ని గ్రామాల్లో మొక్కలు నాటేందుకు లొకేషన్‌లను గుర్తించారు. వర్షాలు కురవగానే మొక్కలు నాటే కార్యక్రమాలను చేపడతాం.

– సురేందర్‌, డీఆర్‌డీవో, కామారెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement