కార్పొరేట్‌ శక్తుల కోసమే మానవ హననం | - | Sakshi
Sakshi News home page

కార్పొరేట్‌ శక్తుల కోసమే మానవ హననం

Jun 2 2025 1:18 AM | Updated on Jun 2 2025 1:18 AM

కార్పొరేట్‌ శక్తుల కోసమే మానవ హననం

కార్పొరేట్‌ శక్తుల కోసమే మానవ హననం

కామారెడ్డి అర్బన్‌ : దేశంలోని సహజ వనరులు, అ టవీ సంపదలను కార్పొరేట్‌ శక్తులకు ధారాదత్తం చే యడానికి కేంద్ర ప్రభుత్వం మానవ హననానికి పూ నుకుందని తెలంగాణ యునైటెడ్‌ ఫ్రంట్‌ నాయకురాలు విమలక్క ఆరోపించారు. శత్రు దేశం పాకిస్తాన్‌తో శాంతి చర్చలు జరపడానికి సిద్ధంగా ఉన్న ప్ర భుత్వం.. దేశంలోని తమ బిడ్డలతో చర్చలు జరప డానికి సిద్ధంగా లేదని పేర్కొన్నారు. తెలంగాణ రచయితల వేదిక(తెరవే) కామారెడ్డి జిల్లా రెండో మ హాసభను ఆదివారం జిల్లాకేంద్రంలోని కర్షక్‌ బీఈ డీ కళాశాలలో నిర్వహించారు. కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ కవులు, కళాకారులు, రచయితలు పాలకుల కుట్రలను బట్టబయలు చేయాలని కోరారు.

ప్రజల గొంతుక తెరవే

తెలంగాణ రచయితల వేదిక ప్రజల గొంతుకగా నిలబడిందని ఆచార్య జయధీర్‌ తిరుమలరావు పేర్కొన్నారు. తెరవేను నిషేధించాలని పాలకులు చూసినా వెనకడుగు వేయలేదని, ప్రజాస్వామ్యబద్ధంగా పనిచేసుకుంటూ పోతోందని పేర్కొన్నారు. కవులు, రచయితలు, కళాకారుల మౌనం దేశానికి ప్రమాదన్నారు. ఆద్యకళను రక్షించడానికి శాశ్వత మ్యూజియం ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. తెలంగాణ అస్తిత్వం, భాష, సాహిత్యం, సంస్కృతుల పరిరక్షణకు తెరవే కృషి చేస్తోందని వేదిక రాష్ట్ర అధ్యక్షుడు కొండి మల్లారెడ్డి పేర్కొన్నారు. మహాసభల్లో ఏర్పాటు చేసిన పుస్తక ప్రదర్శనను కవులు, రచయితలు పరిశీలించారు. తెరవే ప్రత్యేక సంచికను ఆవిష్కరించారు. అమరులైన కవులు, రచయితలను గుర్తు చేసుకుని నివాళులు అర్పించారు. మహాసభల్లో తెరవే జిల్లా అధ్యక్షుడు సిరిసిల్ల గఫూర్‌ శిక్షక్‌, వివిధ జిల్లాల నుంచి వచ్చిన రచయితలు గాజోజు నాగభూషణం, భూర్ల వెంకటేశ్వర్లు, ఉదారి నారాయణ, జి.లచ్చయ్య, ఆడెపు లక్ష్మణ్‌, ప్రేమ్‌లాల్‌, నారాయణగౌడ్‌, సీవీ కుమార్‌, తోకల రాజేశం, పబ్బ విజయశ్రీ తదితరులు పాల్గొన్నారు.

తెరవే జిల్లా మహాసభల్లో విమలక్క

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement