
అవతరణ వేడుకల అతిథి రమేశ్రెడ్డి
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల అతిథిగా టూరి జం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేశ్రెడ్డి హాజరు కానున్నారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జూన్ 2వ తేదీన జిల్లా కేంద్రంలో అవతరణ వేడుకలను ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించింది. కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ఆధ్వర్యంలో ఏర్పాట్లు ప్రారంభించారు.
బాధ్యతలు స్వీకరించిన
మున్సిపల్ కమిషనర్
బిచ్కుంద(జుక్కల్): బిచ్కుంద గ్రామ పంచా యతీ మున్సిపాలిటీగా అప్గ్రేడ్ అయిన విష యం తెలిసిందే. మున్సిపల్ కమిషనర్గా మ హ్మద్ ఖయ్యూం శుక్రవారం ప్రత్యేకాధికారి దిలీప్కుమార్ చేతులు మీదుగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ప్రత్యేకాధికారి మాట్లాడుతూ..కందర్పల్లి, గోపన్పల్లి, దౌల్తా పూర్ కార్యదర్శులు జీపీ రికార్డులు, పన్ను వసూలు చేసిన రిసిప్ట్ బుక్కులు, గ్రామంలో చేసిన పనులకు చెల్లించాల్సిన బిల్లుల రికార్డు లతోపాటు మొత్తం కార్యాలయ రికార్డులు అ ప్పగించాలని సూచించారు. జీపీ రికార్డులు పరిశీలించి స్వాధీనం చేసుకున్నారు. ఇక నుంచి ఇళ్ల నిర్మాణాల అనుమతులు, లావాదేవీలు జరపొద్దని,ఇకనుంచి మున్సిపాలిటీ పరిధిలోనే చెల్లింపులు, అనుమతులు ఇవ్వడం జరుగుతుందన్నారు. ప్రజలు తమ సమస్యలను కమిషనర్ దృష్టికి తీసుకురావాలని సూచించారు.
మూత్రశాలకు తాళం
బీబీపేట: మండలకేంద్రంలోని రైతువేదిక వద్ద మూత్రశాలకు తాళం వేయడంతో శుక్రవారం జీలుగ విత్తనాల కోసం వచ్చిన రైతులు ఇబ్బందులు పడ్డారు. రైతు వేదిక చుట్టూ ఇళ్లు ఉండడంతో మహిళా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇక్కడే మండల వ్యవసాయాధికారి నరేందర్ విధులు నిర్వహిస్తుంటాడు. ఆయన కూడా చూసి చూడనట్లుగా వదిలేయడంతో ఇబ్బందులు తలెత్తున్నాయి. ఇప్పటికై నా అధికారులు ప్రతిరోజు మరుగుదొడ్లు తెరిచి ఉంచేలా చర్యలు తీసుకోవాలని రైతులు కోరారు.
నేడు విద్యుత్ సరఫరాకు
అంతరాయం
కామారెడ్డి అర్బన్ : కామారెడ్డి 132 సబ్ స్టేషన్లో మరమ్మతులు చేపట్టనున్న నేపథ్యంలో శనివారం ఉదయం 7.30 నుంచి 9.30 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరా యం ఏర్పడుతుందని ఎస్ఈ శ్రావణ్కుమా ర్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. కామారెడ్డి పట్టణంతోపాటు గ్రామాల్లోనూ వి ద్యుత్ సరఫరా నిలిచిపోనుందని, వినియోగదారులు సహకరించాలని ఆయన కోరారు.

అవతరణ వేడుకల అతిథి రమేశ్రెడ్డి

అవతరణ వేడుకల అతిథి రమేశ్రెడ్డి