
రైతులకు అండగా బీజేపీ ప్రభుత్వం
కామారెడ్డి టౌన్/లింగంపేట : రైతులు పండించే 14 రకాల పంటలకు కనీస మద్దతు ధర(ఎంఎస్పీ)ను పెంచినందుకు హర్షం వ్యక్తం చేస్తూ భారతీయ జనతా కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లా కేంద్రంలోని నిజాంసాగర్ చౌరస్తాలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చిత్రపటానికి క్షీరాభిషేకం నిర్వహించారు. అలాగే లింగంపేటలోని అంబేడ్కర్ చౌరస్తాలో ప్రధాని మోదీ చిత్ర పటానికి బీజేపీ నాయకులు శుక్రవారం పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు నీలం చిన్న రాజులు మాట్లాడుతూ రైతులకు అండగా బీజేపీ ప్రభుత్వం ఉంటుందన్నారు. ఎంఎస్పీకి రూ. 2.70 లక్షల కోట్లు, రైతులకు వడ్డీ రాయితీకి రూ. 15,642 కోట్ల నిధులు, పెట్టుబడిపై రైతులకు 50% లాభం ఉండేలా నిర్ణయం తీసుకోవడం హర్షనీయమన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను ఇబ్బందులకు గురిచేస్తుందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో కిసాన్ మోర్చా జిలా అధ్యక్షుడు భాస్కర్ రెడ్డి, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి రవీందర్ రావు, కిసాన్ మోర్చా నాయకులు గంగారెడ్డి, కడెం శ్రీకాంత్, ఆనందరావు, లింగారావు, రాజు, జైపాల్ రెడ్డి, నరసింహ రెడ్డి, వీరేశం, రైతులు పాల్గొన్నారు. బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి రవీందర్, అసెంబ్లీ కన్వీనర్ లింగారావు, ఓబీజీ జిల్లా మాజీ అధ్యక్షుడు మురళి, బిఎంఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్ది శివ్వయ్య,
బాన్సువాడ : రైతుల సంక్షేమమే బీజేపీ ధ్యేయమని కిసాన్ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి మోహన్రెడ్డి అన్నారు. శుక్రవారం బాన్సువాడ అంబేడ్కర్ చౌరస్తా వద్ద ప్రధానమంత్రి నరేంద్రమోదీ చిత్ర పటానికి క్షీరాభిషేకం చేశారు.కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు కోనాల గంగారెడ్డి, నాయకులు శంకర్గౌడ్, శ్రీనివాస్రెడ్డి, చిదరి సాయిలు, శ్రీనివాస్, చిరంజీవి, ఉమేష్, యోగి, చీకట్ల రాజు, కొండని గంగారం, రామకృష్ణ, కిషన్ తదితరులున్నారు.

రైతులకు అండగా బీజేపీ ప్రభుత్వం