ప్రభుత్వ అధికారులు తీరిక లేకుండా పనులు చేయాల్సి వస్తోంది. ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్లు, రాజీవ్‌ యువ వికాసం వంటి పథకాలను గ్రౌండింగ్‌ చేయడానికి అధికారులు క్షేత్రస్థాయిలో తిరుగుతున్నారు. అలాగే భూభారతి చట్టంపై అవగాహన కల్పించేందుకు ఊరూరా రెవెన్యూ సద | - | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ అధికారులు తీరిక లేకుండా పనులు చేయాల్సి వస్తోంది. ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్లు, రాజీవ్‌ యువ వికాసం వంటి పథకాలను గ్రౌండింగ్‌ చేయడానికి అధికారులు క్షేత్రస్థాయిలో తిరుగుతున్నారు. అలాగే భూభారతి చట్టంపై అవగాహన కల్పించేందుకు ఊరూరా రెవెన్యూ సద

May 31 2025 1:06 AM | Updated on May 31 2025 1:06 AM

ప్రభుత్వ అధికారులు తీరిక లేకుండా పనులు చేయాల్సి వస్తోంద

ప్రభుత్వ అధికారులు తీరిక లేకుండా పనులు చేయాల్సి వస్తోంద

సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్లు, రాజీవ్‌ యువ వికాసం, భూభారతి అవగాహన సదస్సులు వీటికి తోడు ముందస్తు వర్షాలతో సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా చర్యలు చేపట్టడం, విత్తనాలు, ఎరువుల కొరతను అధిగమించడం, నకిలీ విత్తనాలను అరికట్టడం, స్కూళ్లు, కాలేజీలు పునః ప్రారంభమవుతుండడంతో సౌకర్యాలపై దృష్టి పెట్టడం.. ఇలా ఆయా అంశాలపై అధికారులు నిరంతరం శ్రమించాల్సి ఉంటుంది. ఈ నెల 28, 29 తేదీలలో జిల్లా కలెక్టర్‌తో పాటు జిల్లా ఇన్‌చార్జి మంత్రి క్షేత్రస్థాయిలో పర్యటించి వానాకాలం సాగు ఏర్పాట్లు, ఇందిరమ్మ ఇళ్లు, భూభారతిపై సమీక్షలు నిర్వహించి జూన్‌ 1 నాటికి ప్రభుత్వానికి నివేదిక అందించాల్సి ఉంటుంది. 2న జిల్లా కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది. తరువాతి రోజు నుంచి వరుస కార్యక్రమాలతో అధికారులు బిజీగా ఉండాల్సిందే. ఆయా కార్యక్రమాలు అమలుతీరుపై క్షేత్ర స్థాయిలో పర్యవేక్షణ చేయాల్సి ఉంటుంది.

రాజీవ్‌ యువ వికాసం గ్రౌండింగ్‌

రాజీవ్‌ యువ వికాసం లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ ను పూర్తి చేసి జూన్‌ 2 నుంచి 9వ తేదీ వరకు మంజూరు పత్రాలను అందించాల్సి ఉంటుంది. జూన్‌ 10 నుంచి 15వ తేదీ వరకు జిల్లా, నియోజకవర్గ స్థా యిలో రాజీవ్‌ యువవికాసం లబ్ధిదారులకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తారు. 16 నుంచి స్వయం ఉపాధి యూనిట్లను ప్రారంభించాల్సి ఉంటుంది.

విత్తనాలు, ఎరువులు

అందుబాటులో ఉండేలా..

ఈసారి రుతు పవనాలు ముందుగానే రావడంతో వర్షాకాలం పంటల సాగు మొదలుకానున్న నేపథ్యంలో అవసరమైన మేర విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచడానికి జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టాలి. జిల్లాలో బోర్లు, బావులు, ప్రాజెక్టుల కింద వరి పంట సాగవుతుండగా, మెట్ట ప్రాంతాల్లో మొక్కజొన్న, పత్తి, సోయాతో పాటు పప్పుదినుసులు సాగు చేస్తారు. అవసరమైన విత్తనాలు అందుబాటులో ఉంచాలి. ఇదే సమయంలో నకిలీ విత్తనాలపై దృష్టి సారించాలి.

సీజనల్‌ వ్యాధులపై అప్రమత్తత అవసరం

వర్షాకాలం సీజన్‌లో డయేరియా, మలేరియా వంటి వ్యాధులు ప్రబలుతుంటాయి. ఈ నేపథ్యంలో పారిశుధ్య సమస్యను పరిష్కరించడం, తాగునీరు కలుషితం కాకుండా చూసుకోవలసిన బాధ్యత యంత్రాంగంపై ఉంటుంది. ఎప్పటికప్పుడు తనిఖీలు చేపట్టి సమస్యలు పరిష్కరించాలి. సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలన్నీ తీసుకోవాలి. ఒకవేళ వ్యాధులు ప్రబలితే వెంటనే వైద్య చికిత్స అందించాల్సి ఉంటుంది. అవసరమైన మందులు నిల్వ చేసి ఉంచాలి.

స్కూళ్లు, కాలేజీలు పునఃప్రారంభం

వేసవి సెలవులు ముగించుకుని స్కూళ్లు, కాలేజీలు పునఃప్రారంభం కానున్నాయి. స్కూళ్లు తెరిచే నాటికి విద్యార్థులకు అవసరమైన పుస్తకాలు, యూనిఫాంలు సిద్ధం చేయాలి. అలాగే స్కూళ్లు, కాలేజీల్లో మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన అవసరం ఉంది. చాలా స్కూళ్లలో సమస్యలు వెక్కిరిస్తున్నాయి. స్కూళ్లు తెరవడానికి మరో పదిహేను రోజులు మాత్రమే ఉంది. ఈ లోపు అన్ని సమస్యలు పరిష్కరించాలి. అలాగే స్కూళ్లలో విద్యార్థులు చేరేలా బడిబాట నిర్వహించాలి. హాస్టళ్లు, గురుకులాలు, కస్తూర్భాలలో సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలి.

ఇందిరమ్మ ఇళ్లపై ఫోకస్‌

ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం పనులు ముందుకు కదలడం లేదు. ఈ నేపథ్యంలో లబ్ధిదారులు ఇళ్లు నిర్మించుకునేలా అధికారులు ప్రోత్సహించాల్సి ఉంటుంది. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ఉచితంగా ఇసుక అందించే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం అధికారులకు దిశానిర్దేశం చేసింది. ఇదే సమయంలో ఇందిరమ్మ ఇళ్ల పేరుతో ఇసుక దోపిడీ జరగకుండా కట్టడి చేయాలని ఆదేశించింది.

జూన్‌ 3 నుంచి 20 వరకు భూభారతి సదస్సులు

ధరణి స్థానంలో తీసుకువచ్చిన భూభారతి పోర్టల్‌పై జూన్‌ 3 నుంచి 20 వరకు మండలాల్లో భూ భారతి సదస్సులు నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించింది. దీంతో రెవెన్యూ యంత్రాంగం సదస్సుల నిర్వహణపై దృష్టి సారించింది. భూభారతిపై రైతులకు అవగాహన కల్పించాల్సి ఉంటుంది. పైలట్‌ ప్రాజెక్టుగా ఎంపికై న లింగంపేట మండలంలో రెవెన్యూ గ్రామాల వారీగా రెవెన్యూ సదస్సులు జరిగాయి.

మిగతా 24 మండలాల్లో అవగాహన సదస్సులు చేపట్టాల్సి ఉంటుంది.

ఇందిరమ్మ ఇళ్ల గ్రౌండింగ్‌

పర్యవేక్షించడం

రాజీవ్‌ యువ వికాసం లబ్ధిదారుల

ఎంపిక, శిక్షణ

భూభారతి అమలుపై రెవెన్యూ సదస్సులు

సీజనల్‌ వ్యాధులపై దృష్టి పెట్టాల్సిందే...

విత్తనాలు, ఎరువుల సరఫరా,

నకిలీ విత్తనాలపై ఫోకస్‌

స్కూళ్లు, కాలేజీల్లో మౌలిక

సదుపాయాల కల్పన

జూన్‌ నెల మొత్తం బిజీ షెడ్యూల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement