అప్రమత్తంగా ఉండాలి | - | Sakshi
Sakshi News home page

అప్రమత్తంగా ఉండాలి

May 31 2025 1:06 AM | Updated on May 31 2025 3:40 PM

బాన్సువాడ : వర్షాకాలంలో సీజనల్‌ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని డీఎంహెచ్‌వో చంద్రశేఖర్‌ సూచించారు. బీర్కూర్‌ ప్రాథమి క ఆరోగ్య కేంద్రాన్ని శుక్రవారం ఆయన తని ఖీ చేశారు. ల్యాబ్‌తోపాటు ఫార్మసీ గదిని, డె లివరీ రూములను పరిశీలించారు. ఇన్‌ పే షెంట్‌, అవుట్‌ పేషెంట్‌ల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, మొక్కలను నాటాలని సూచించారు. వైద్యులు విధులను నిర్లక్ష్యం చేస్తే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశా రు. ఆయన వెంట ఆస్పత్రి సిబ్బంది దయానంద్‌, శ్రీలేఖ తదితరులు ఉన్నారు.

ప్రభుత్వ స్కూళ్లలోనే నాణ్యమైన విద్య

సదాశివనగర్‌(ఎల్లారెడ్డి) : ప్రభుత్వ పాఠశాలల్లోనే విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుందని రాష్ట్ర విద్య పరిశోధన శిక్షణ మండలి జాయింట్‌ డైరెక్టర్‌ ఉషారాణి అన్నారు. మండలంలోని కల్వరాల్‌ జెడ్పీ పాఠశాలను జేడీ శుక్రవారం పరిశీలించారు. ఈ సంద ర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో విలువలతో కూడిన విద్య అందుతుందని, ప్రభుత్వ పాఠశాలలు బాగు పడాలంటే తల్లిదండ్రుల సహకారం అవసరమన్నారు. పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను ఏడు నుంచి 53కు పెంచిన హెచ్‌ఎం విష్ణువర్ధన్‌రెడ్డిని అభినందించారు. జేడీవెంట డీఈవో రాజు, వీడీసీ చైర్మన్‌ రాజురెడ్డి ఉన్నారు.

ప్రోటోకాల్‌ పేరుతో అడ్డంకులు

బీబీపేట: కామారెడ్డి ఎమ్మెల్యేగా గెలిచిన నాటి నుంచి కాటిపల్లి వెంకటరమణారెడ్డి అభివృద్ధి చేయకపోగా, రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనులను ప్రోటోకాల్‌ పేరుతో అడ్డుకుంటున్నారని కాంగ్రెస్‌ నాయ కులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ మోడల్‌ ఇంటి ఎదుట ఎమ్మెల్యే తీరును నిరసిస్తూ శుక్రవారం బైఠాయించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ మండలాధ్యక్షుడు సుతారి రమేశ్‌ మాట్లాడుతూ.. ఈ నెల 29వ తేదీన ఇందిరమ్మ ఇంటి ప్రారంభోత్సవం ఉండగా ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి జిల్లా అధికారులకు ఫోన్‌ చేసి ప్రోటోకాల్‌ ప్రకారం తాను లేకుండా ఎలా ప్రారంభోత్సవం చేస్తారని బెదిరించారని మండిపడ్డారు. 

గెలిచిన నాటి నుంచి కేవీఆర్‌ గొప్పలు చెప్పుకోవడానికే పరిమితమయ్యారని, రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న చెక్కులను ఇవ్వడానికే పరిమితమయ్యారని మార్కెట్‌ కమిటీ చైర్మెన్‌ పాత రాజు విమర్శించారు. అభివృద్ధిపై వచ్చే నెల 5వ తేదీన బీబీపేట చౌరస్తాలో బహిరంగ చర్చకు సిద్దంగా ఉన్నామని దమ్ముంటే రా వాలని ఎమ్మెల్యేకు సవాల్‌ విసిరారు. భూమాగౌడ్‌, ఇంద్రసేనారెడ్డి, ఆయా గ్రా మాల అధ్యక్షులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

అప్రమత్తంగా ఉండాలి1
1/2

అప్రమత్తంగా ఉండాలి

అప్రమత్తంగా ఉండాలి2
2/2

అప్రమత్తంగా ఉండాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement