
ఎవరెస్ట్ బేస్ క్యాంపును అధిరోహించిన జిల్లావాసి
కామారెడ్డి అర్బన్: కామారెడ్డి లిటిల్ స్కాలర్స్ హైస్కూల్ డైరెక్టర్ జ్యోత్స్న నేపాల్ మార్గంగా ఎవరెస్ట్ బేస్ క్యాంప్(5,364 మీటర్ల ఎత్తు) అధిరోహించారు. త్రివర్ణ పతాకంతో పాటు పాఠశాల బ్యానర్ను ప్రదర్శించారు. జ్యోత్స్న ఎవరెస్ట్ను అధిరోహించడం తమ పాఠశాలకు గర్వకారణమని ఆ స్కూల్ యాజమాన్యం పేర్కొంది.
విద్యార్థి సంఘాల ఆందోళన
కామారెడ్డి టౌన్: అనుమతి లేకుండా అడ్మిషన్లు నిర్వహిస్తున్నారని ఆరోపిస్తూ జిల్లా కేంద్రంలోని ఓ స్కూల్లో విద్యార్థి సంఘాల నాయకులు గురువారం ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. స్కూల్కు అనుమతి లేదని డీఈవో ఉత్తర్వులు జారీ చేసినా స్కూల్ యాజమాన్యం విద్యార్థులను వారి తల్లిదండ్రులను మోసం చేస్తూ అడ్మిషన్లు తీసుకుంటున్నారని తెలిపారు. పుస్తకాలు, యూనిఫాం, అడ్మిషన్ల పేరిట ఫీజులు వసూళ్లు చేస్తున్నారని తక్షణమే స్కూల్పై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఆందోళనలో నాయకులు విఠల్, ముదాం అరుణ్కుమార్, బుల్లెట్, స్టాలిన్, మణికంఠ, రాహుల్, హరి, శివకృష్ణ, మనోజ్ తదితరులు పాల్గొన్నారు.
గణపతి ఆలయంలో పూజలు
కామారెడ్డి అర్బన్: పట్టణంలోని పశ్చిమ హౌసింగ్బోర్డు కాలనీలోని సంకష్టహర గణపతి ఆలయంలో గురువారం భక్తిశ్రద్ధలతో సామూహిక కల్యాణ తిలక ఉత్సవం నిర్వహించారు. పెళ్లి కాని, వివాహ ప్రయత్నం చేస్తున్న యువతీ, యువకులు సుమారు 105 మంది కల్యాణ తిలకం ఉత్సవంలో పాల్గొని పూజలు చేశారు. కార్యక్రమంలో వేదపండితుడు జి ఆంజనేయశర్మ, ఆలయ కమిటీ ప్రతినిధులు సుతారి అంజయ్య, రవీందర్గౌడ్, విశ్వనాథం తదితరులు పాల్గొన్నారు.
ఆర్మూర్లో పోలీసుల తనిఖీ
ఆర్మూర్టౌన్: ఆర్మూర్ పట్టణంలో గురువారం రాత్రి నిషేధిత మాదక ద్రవ్వాలపై ఎస్హెచ్వో సత్యనారాయణగౌడ్ ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు. పట్టణంలోని పాత బస్టాండ్లో ప్రయాణికుల బ్యాగులను, హోటళ్లు, పాన్ షాపులతోపాటు పలు దుకాణాల్లో నిషేధిత మత్తు పదార్థాలు, ఇతర చట్టవిరుద్ధ వస్తువులను గుర్తించేందుకు స్నిపర్ డాగ్లతో తనిఖీలు చేశారు. నిషేధిత మత్తు పదార్థాలు వాడితే చర్యలు తప్పవన్నారు.

ఎవరెస్ట్ బేస్ క్యాంపును అధిరోహించిన జిల్లావాసి

ఎవరెస్ట్ బేస్ క్యాంపును అధిరోహించిన జిల్లావాసి