పేరుకే పార్ట్‌టైం.. పనులు ఫుల్‌టైం | - | Sakshi
Sakshi News home page

పేరుకే పార్ట్‌టైం.. పనులు ఫుల్‌టైం

May 31 2025 1:20 AM | Updated on May 31 2025 1:20 AM

పేరుక

పేరుకే పార్ట్‌టైం.. పనులు ఫుల్‌టైం

కామారెడ్డి రూరల్‌: ప్రభుత్వ పాఠశాలల్లో పరిశుభ్రతతోపాటు ఉపాధ్యాయులకు, విద్యార్థులకు అన్ని విధాలుగా సౌకర్యాలు కల్పించే పార్ట్‌టైం స్వీపర్ల పరిస్థితి దయనీయంగా మారింది. పేరుకే పార్ట్‌ టైం అయినప్పటికీ పనులు మాత్రం ఫుల్‌టైమ్‌ చేయాల్సి వస్తోందని వారు వాపోతున్నారు. ఉదయం నుంచి పాఠశాల ముగిసే వరకు డ్యూటీ చేయాల్సి వస్తుందని, అయినా అరకొర వేతనాలనే అందిస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఉమ్మడి జిల్లాలో 110 మంది స్వీపర్లు..

ఉమ్మడి జిల్లాలో సుమారు 200 మంది వరకు పార్ట్‌ టైం స్వీపర్లుగా 1986లో విధుల్లో చేరారు. అప్పుటి ప్రభుత్వం కేవలం రూ.150 వేతనం మాత్రమే అందించేది. విధులు నిర్వహిస్తున్న పార్ట్‌ టైమ్‌ స్వీపర్లలో 40 మంది వరకు చనిపోయారు. మరో 30 మంది పదవీవిరమణ పొందారు. ప్రస్తుతం కామారెడ్డి జిల్లాలో 80 మంది వరకు, నిజామాబాద్‌ జిల్లాలో 30 మంది వరకు ఆయ పాఠశాలల్లో స్వీపర్లుగా కొనసాగుతున్నారు. పార్ట్‌టైమ్‌ స్వీపర్లు అన్న మాటే కానీ ప్రతిరోజు పాఠశాలలో ఫుల్‌టైమ్‌ విధులు నిర్వహించాల్సిన వస్తోందని, ఈ ఉద్యోగం వదులుకోలేక ఇతర పనులు చేసుకోలేకపోతున్నామని వాపోతు న్నారు. నెల జీతం రూ.5,200 వస్తుండటంతో 25 రోజులు పనులు చేస్తే రోజు వేతనం రూ. 208 మాత్రమే వర్తిస్తుందన్నారు. దీంతో కనీసం ఉపాధి హామీ కూలీ వేతనం కూడా గిట్టుబాటు కానీ పరిస్థితి ఉందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పెండింగ్‌లో వేతనాలు..

పార్ట్‌టైమ్‌ స్వీపర్లుగా ఏళ్లుగా విధులు నిర్వహిస్తున్నప్పటికీ వేతనం మాత్రం పెరగడం లేదని, దీంతో కుటుంబాలను ఎలా పోషించుకోవాలో తెలియడం లేదని వారు వాపోతున్నారు. అరకొర వేతనాలు ఇస్తుండటంతోపాటు అర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆ వేతనాలు కూడా నెలల తరబడి బయాయి పెట్టడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి స్వీపర్ల దీన పరిస్థితిని గమనించి వారిని ఫుల్‌టైమ్‌ స్వీపర్లుగా గుర్తించి పూర్తిస్థాయి వేతనాలు అందించాలని కోరుతున్నారు.

దయనీయంగా మారిన

స్కూల్‌ స్వీపర్ల పరిస్థితి

అరకొర వేతనాలతో తీవ్ర ఇబ్బందులు

పట్టించుకోని ఉన్నతాధికారులు

కుటుంబాన్ని పోషించలేని దుస్థితి..

నిజామాబాద్‌ జిల్లా వేల్పూర్‌ మండలం వాడి గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో గత 40 ఏళ్లుగా పార్ట్‌టైం స్వీపర్‌గా పనిచేస్తున్నా. 1986లో జీతం రూ. 150 కాగా ఇప్పుడు రూ.5,200 వస్తుంది. వచ్చే జీతంతో కుటుంబాన్ని పోషించలేని పరిస్థితి ఉంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు పాఠశాలలో అన్ని పనులు చేస్తాం. ప్రభుత్వం మా ఉద్యోగులను పర్మినేంట్‌ చేయాలి. –బాలయ్య,

స్వీపర్స్‌ సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు

ప్రభుత్వం ఆదుకోవాలి

1992 నుంచి స్వీపర్‌గా పనిచేస్తున్నా. ఉదయం గంట కొట్టుడు నుంచి సాయంత్రం బడికి తాళం వేసే వరకు ఉంటాం. మమ్మల్నీ మాత్రం పట్టించుకునే వారు లేరు. ఏళ్లుగా వేతనం పెరగడంలేదు. ప్రభుత్వం మా పరిస్థితిని పరిశీలించి ఫుల్‌టైమ్‌ స్వీపర్‌ గా గుర్తించి పూర్తిస్థాయి వేతనం అందించాలని వేడుకుంటున్నా. ఇప్పటికై నా ప్రభుత్వం స్వీపర్లను ఆదుకోవాలని కోరుతున్నాం.

–గడీల సరోజ, గర్గుల్‌ హైస్కూల్‌, కామారెడ్డి

పేరుకే పార్ట్‌టైం.. పనులు ఫుల్‌టైం 1
1/2

పేరుకే పార్ట్‌టైం.. పనులు ఫుల్‌టైం

పేరుకే పార్ట్‌టైం.. పనులు ఫుల్‌టైం 2
2/2

పేరుకే పార్ట్‌టైం.. పనులు ఫుల్‌టైం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement