
నాన్బెయిలబుల్ వారెంట్ నిందితుడి పట్టివేత
ఖలీల్వాడి: పలు కేసుల్లో నిందితుడిగా ఉన్న ఓ వ్యక్తి పోలీసులకు చిక్కకుండ తిరుగుతుండగా, అతడిపై నాన్బెయిలబుల్ వారెంట్ ఇష్యూ కాగా శుక్రవారం పట్టుకున్నట్లు సీపీ పోతరాజు సాయిచైతన్య ఒక ప్రకటనలో తెలిపారు. వివరాలు ఇలా.. మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా దేగ్లూర్ తాలూకాలోని ఖానాపూర్ గ్రామానికి చెందిన బబ్లు బాలాజీ గైక్వాడ్ అలియాస్ ధన్ల బాబు (47) కొన్ని సంవత్సరాలుగా కామారెడ్డి జిల్లాలో పలు నేరాలకు పాల్పడ్డాడు. ఇతడిపై 24 వారెంట్లు ఇష్యూ కాగా, పోలీసులు ఎంత గాలించినా ఆచూకీ లభించలేదు. నగరంలో అతడు సంచరిస్తున్నట్లు సీపీకి విశ్వసనీయ సమాచారం రావడంతో సీసీఎస్ పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. ఈమేరకు సీసీఎస్ పోలీసులు నిందితుడిని పట్టుకుని కామారెడ్డి పోలీసులకు అప్పగించారు. సీసీఎస్ బృందాన్ని సీపీ సాయిచైతన్య అభినందించారు.