
బడి బాట షురూ
కామారెడ్డి టౌన్ : సర్కారు బడుల బలోపేతం కోసం, విద్యార్థుల సంఖ్య పెంపుకోసం ప్రభు త్వం ఆచార్య జయశంకర్ బడిబాట కార్యక్ర మాన్ని నిర్వహిస్తోంది. శుక్రవారం జిల్లావ్యాప్తంగా ఈ కార్యక్రమం ప్రారంభమైంది. మొద టిరోజు జిల్లాలో 269 మంది విద్యార్థులను గుర్తించారు. కాగా మే 16వ తేదీ నుంచి ముందస్తు బడిబాట కార్యక్రమం నిర్వహించి మొ త్తం 3,699 విద్యార్థులను బడిలో చేర్పించారు. ప్రస్తుత బడిబాటను 19వ తేదీ వరకు నిర్వహించనున్నారు. తొలిరోజు ప్రజాప్రతినిధులు, తల్లిదండ్రులతో గ్రామ సభలు నిర్వహించాల్సి ఉండగా.. కొన్నిచోట్ల మాత్రమే సమావేశాలు జరిగాయి. చాలా చోట్ల మొక్కుబడిగా కార్యక్రమం ప్రారంభమైంది.