
వ్యక్తి అదృశ్యం
కామారెడ్డి క్రైం: పట్టణంలోని భవానీ రోడ్లో నివాసం ఉండే బొడ్డి నూకరాజు (55) అనే వ్యక్తి అదృశ్యమైనట్లు పట్టణ ఎస్హెచ్వో చంద్రశేఖర్రెడ్డి శుక్రవారం తెలిపారు. నూక రాజుకు ఇద్దరు భార్యలు ఉండగా, మేసీ్త్ర పని చేసుకుంటూ జీవనం సాగించేవాడు. ఈనెల 2న ఇంటి నుంచి బయటకు వెళ్లిన అతడు ఇప్పటికీ తిరిగి రాలేడు. కుటుంబసభ్యులు ఎంతవెతికినా అతడి ఆచూకీ లభించలేదు. రెండో భార్య జ్యోతి పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్హెచ్వో తెలిపారు.
సజ్జన్పల్లిలో వివాహిత..
లింగంపేట(ఎల్లారెడ్డి): మండలంలోని సజ్జన్పల్లి గ్రామానికి చెందిన చిన్నప్పగారి రుక్కవ్వ అనే వివాహిత అదృశ్యమైనట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. రుక్కవ్వ సోమవారం ఇంటికి తాళం వేసి బయటకు వెళ్లగా, ఇప్పటికీ తిరిగిరాలేదు. కుటుంబసభ్యులు ఎంత వెతికినా ఆమె ఆచూకీ లభించలేదు. దీంతో కుటుంబసభ్యులు నాగిరెడ్డిపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.
వెంకటాపూర్ కాంగ్రెస్ గ్రామ కమిటీ ఎన్నిక
ఎల్లారెడ్డిరూరల్ : ఎల్లారెడ్డి మండలంలోని వెంకటాపూర్ గ్రామ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా నిజ్జన పోచన్నను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు మండల పార్టీ అధ్యక్షులు సాయిబాబా శుక్రవారం తెలిపారు. గ్రామంలో నిర్వహించిన సమావేశంలో ప్రధాన కార్యదర్శిగా పెంటయ్య, సహాయ కార్యదర్శిగా చిరంజీవులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో మల్లేష్ ఉన్నారు.
నల్లమడుగు ఎమ్మార్పీఎస్ గ్రామ కమిటీ..
లింగంపేట(ఎల్లారెడ్డి): మండలంలోని నల్లమడుగు ఎమ్మార్పీఎస్ గ్రామ కమిటీని శుక్రవారం మండల ఎమ్మార్పీఎస్ నెల్లూరి గంగారాం ఆధ్వర్యంలో ఎన్నుకున్నట్లు తెలిపారు. అధ్యక్షుడిగా మాల్తూమ్ సాయిలు, ఉపాధ్యక్షుడిగా మాల్తూమ్ నర్సింలు, ప్రధాన కార్యదర్శి గంగాధర్, కోశాధికారి గులాంగారి సంజీవులు, సలహాదారులు శేఖర్, సంజీవులు, భాస్కర్, సాయిలును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కార్యక్రమంలో మండల నాయకులు భూపతి, మాసాని సాయిలు తదితరులు పాల్గొన్నారు.

వ్యక్తి అదృశ్యం