
నిజామాబాద్లో కరోనా కేసు
జిల్లా జనరల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితుడు
జాగ్రత్తలు తప్పనిసరి
ప్రజలందరు తప్పనిసరిగా జాగ్రత్తలు తీ సుకోవాలని జిల్లా వైద్యాధికారి రాజశ్రీ, జీజీహెచ్ సూపరింటెండెంట్ శ్రీనివాస్ తెలిపారు. కరోనా కేసు నమోదు దృష్ట్యా జాగ్రత్తలు అవసరమన్నారు. తప్పని సరిగా అందరు మాస్క్లు ధరించాలన్నా రు. శానిటైజర్ దగ్గర పెట్టుకోవాలన్నా రు. గుంపుల్లో సంచరించ వద్దన్నారు. ఎక్కడికి వెళ్లినా కచ్చితంగా మాస్క్లుపెట్టుకోవాలని సూచించారు.
నిజామాబాద్నాగారం : నిజామాబాద్ జిల్లాలో కరోనా పాజిటివ్ కేసు నమోదు అయ్యింది. నగరంలోని అంబేడ్కర్కాలనీకి చెందిన వ్యక్తికి రెండు రోజులుగా జ్వరం, దగ్గు, ఆయాసం రావడంతో శనివారం ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి (జీజీహెచ్)కు చికిత్స నిమిత్తం వ చ్చారు. వైద్యులు ర్యాపిడ్ టెస్ట్ చేయడంతో కరో నా పాజిటివ్ వచ్చింది. దీంతో ఇంటి వద్దే ఉండి జాగ్రత్తలు తీసుకోవాలని, మందులు వేసుకుంటే సరిపోతుందని వైద్యులు సూచించారు. అయితే ఇంటి వద్ద చిన్నపిల్లలు, వృద్ధులైన అ మ్మనాన్న ఉండడంతో ఆస్పత్రిలోనే ఉండి చికి త్స తీసుకుంటానని బాధితుడు చెప్పాడు. వై ద్యులు వెంటనే సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీనివాస్కు సమాచారం ఇవ్వడంతో జీజీహెచ్లో 7వ అంతస్తులోని ఐసోలేషన్ ప్రత్యేక వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు. వారం రోజుల క్రి తం నగరంలో ఓఫంక్షన్కు వెళ్లడంతోనే జ్వరం, దగ్గు వచ్చినట్లు కరోనా బాధితుడు తెలిపారు. 2020 సంవత్సరంలో కూడా సదరు వ్యక్తికి కరో నా వచ్చింది.
నేడు కుటుంబ సభ్యులకు ర్యాపిడ్ పరీక్షలు
కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తి కుటుంబానికి చెందిన సభ్యులకు ఆదివారం ర్యాపిడ్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఎవరికై నా పాజిటివ్ వస్తే ఐసోలేషన్లో ఉంచి చికిత్స అందించనున్నట్లు ఆస్పత్రి వైద్యులు డాక్టర్ వెంకటేష్ తెలిపారు.