అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇళ్లు | - | Sakshi
Sakshi News home page

అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇళ్లు

May 31 2025 1:20 AM | Updated on May 31 2025 1:20 AM

అర్హు

అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇళ్లు

బాన్సువాడ రూరల్‌: అర్హులైన పేదలకు కుల, మతాలు, పార్టీలకు అతీతంగా ఇందిరమ్మ ఇళ్లు మంజూరు ఇస్తున్నట్లు రాష్ట్ర వ్యవసాయ సలహాదారు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన బాన్సువాడ మండలం బోర్లంక్యాంపు తండాలో ఇరువురు లబ్ధిదారుల ఇందిరమ్మ ఇంటి భూమిపూజ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. గతంలో గృహలక్ష్మిలో భాగంగా జిల్లాకలెక్టర్‌ ద్వారా మంజూరు వచ్చిన వారు కూడా ప్రస్తుతం ఇందిరమ్మ ఇళ్లు నిర్మించుకోవడానికి అర్హులేనన్నారు. గతంలో డబుల్‌ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణంలో బాన్సువాడ నియోజకవర్గం ఆదర్శంగ నిలిచినట్లు ఇందిరమ్మ ఇంటినిర్మాణాల్లోనూ ఆదర్శంగా నిలపడానికి కృషి చేస్తున్నామన్నారు. ఇందులో భాగంగా ఇసుక అతి తక్కువ ధరకు లబ్దిదారులకు సరఫరా చేసేలా ట్రాక్టర్‌ ఓనర్లను ఒప్పించామన్నారు. ఆయన వెంట స్టేట్‌ ఆగ్రో ఇండస్ట్రీస్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ కాసుల బాలరాజు, హౌసింగ్‌ డీఈ గోపాల్‌, డీఎల్‌పీవో సత్యనారాయణరెడ్డి, ఎంపీడీవో ముజాహిద్‌, నాయకులు శ్రీనివాస్‌రెడ్డి, నర్సింలు, రాజేశ్వర్‌గౌడ్‌, మమ్మాయి కాశీరాం, పీర్యానాయక్‌, శ్రీనివాస్‌రెడ్డి, కొండా శ్రీశైలం, సుభాష్‌, సంజీవ్‌రెడ్డి , కాపర్తి భరత్‌ తదితరులు పాల్గొన్నారు.

ఇళ్ల నిర్మాణాలు వేగవంతంగా పూర్తి చేయాలి

భిక్కనూరు/నాగిరెడ్డిపేట/బాన్సువాడ /నస్రుల్లాబాద్‌/ నిజాంసాగర్‌/కామారెడ్డి రూరల్‌ : ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు తమ ఇళ్ల నిర్మాణపనులను వేగవంతంగా పూర్తి చేయాలని డీఎల్‌పీవో శ్రీనివాస్‌ అన్నారు. శుక్రవారం ఆయన భిక్కనూరు మండలం బస్వాపూర్‌ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల భూమిపూజ లో పాల్గొన్నారు. అనంతరం లబ్ధిదారులకు ధ్రువీకరణపత్రాలను అందజేసి నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. నాగిరెడ్డిపేట మండలం మెల్లకుంటతండాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ఎల్లారెడ్డి డీఎల్‌పీవో మార్కింగ్‌ ఇచ్చి లబ్ధిదారులకు మంజూరుపత్రాలను అందజేశారు. బీర్కూర్‌ మండలం దామరంచ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు ఇందిరమ్మ కమిటీ సభ్యులు ముగ్గు వేసి పనులు ప్రారంభించారు. నస్రుల్లాబాద్‌ మండలం సంగం గ్రామంలో ఇందిరమ్మ ఇళ్లకు మాజీ ఎంపీపీ పాల్త్య విఠల్‌ భూమి పూజ చేశారు.నిజాంసాగర్‌ మండలం ఒడ్డేపల్లి గ్రామ పంచాయతీలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాలను కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు ప్రజా పండరి అందజేశారు.కామారెడ్డి మున్సిపల్‌ పరిధిలోని సరంపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ముగ్గుపోశారు. ఈ సందర్భంగా మాజీ కౌన్సిలర్‌ ఆకూల రూప రవికుమార్‌ మాట్లాడుతూ...ఇళ్ల నిర్మాణం చేపట్టినవారికి దశల వారిగా బిల్లులు మంజూరవుతాయన్నారు.

గృహలక్ష్మి లబ్ధిదారులూ అర్హులే..

లబ్ధిదారులకు తక్కువ ధరకే ఇసుక

వ్యవసాయ సలహాదారు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి

అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇళ్లు 1
1/1

అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇళ్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement