
కంబోడియాలోనే కిరణ్కుమార్ అంత్యక్రియలు
కామారెడ్డి అర్బన్: పట్టణ పరిధిలోని దేవు నిపల్లికి చెందిన భూంరావుగారి కిరణ్కు మార్ ఉపాధి కోసం కంబోడియా రాజధా ని నాంఫెన్కి వెళ్లగా, ఈనెల 14న గుండెపోటుతో మృతి చెందాడు. మృతదేహాన్ని సొంతూరికి తీసుకురావడానికి వీసాకు సంబంధించి పలు చిక్కులతో పాటు ఆర్థిక భా రం కావడంతో చివరిచూపు కోసం కుటుంబ సభ్యులు పాస్పోర్టులకు దరఖాస్తు చేసుకున్నా రు. పాస్పోర్టులు చేతికి అందడంతో బుధవారం వారు నాంఫెన్ వెళ్లారు. శుక్రవారం ఉదయం అక్కడే కిరణ్కుమార్ అంత్యక్రియలను సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు. భార్య మందాకిని, కొడుకు కార్తికేయ, తల్లి సుగుణబాయి, అన్న ప్రవీణ్కుమార్ అంత్యక్రియల్లో పాల్గొనగా, గుగూల్ మీ ట్ ద్వారా ఇక్కడి బంధువులు అంత్యక్రియలను తిలకించి కన్నీరు పెట్టుకున్నారు. నాంఫెన్ వెళ్లిన కుటుంబసభ్యులను భారత రాయబార కార్యాలయం అధికారులు మంచి సహకారం అందించారని కిరణ్కుమార్ బంధువు శ్రీకాంత్రావు తెలిపారు.