
చెరువు శిఖం భూమి కబ్జా
నిజామాబాద్ రూరల్: జిల్లా కేంద్రంలోని సారంగా పూర్ శివారులో చెరువు శిఖం భూముల ఆక్రమణ, అక్రమ రిజిస్ట్రేషన్ల వ్యవహరం ఇటీవల వెలుగు చూసింది. 10 ఎకరాల చెరువు శిఖం భూమిలో ప్లా ట్ల దందా ప్రారంభించారు. నిజామాబాద్ – బోధన్ ప్రధాన రహదారికి ఆనుకొని ఉన్న కోట్ల రూపా యల విలువజేసే ఈ స్థలంపై అక్రమార్కుల కన్ను పడింది. దీంతో శిఖం భూమి పక్కనే ఉన్న ప్రైవేటు భూమి పట్టాను చూపుతూ కొందరు కబ్జాకు యత్నిస్తున్నట్లు తెలిసింది. కాగా, గతంలో చెరువు శిఖం భూమిని పరిశీలించిన రెవెన్యూ అధికారులు ప్రభుత్వ స్థలంగా గుర్తిస్తూ బోర్డును పెట్టారు. సర్వే నంబర్ 231లోని సుమారు 10 ఎకరాల 8 గుంటల శిఖం భూమి చుట్టూ కందకాన్ని తవ్వారు. కానీ, ఇటీవల ఓ మాజీ కార్పొరేటర్ కందకాన్ని తొలగించి శిఖం స్థలంలో ప్లాట్లు చేసి అమాయకులకు విక్రయించేందుకు యత్నిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. అందులో భాగంగానే శిఖం భూమిని కబ్జాదారుల నుంచి కాపాడాలని స్థానిక నాయకులు కొందరు ఇటీవల కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. దీంతో ఆర్డీవో రాజేంద్ర కుమార్ రెవెన్యూ సిబ్బందితో కలిసి చెరువు శిఖం భూమిని పరిశీలించారు.
పది ఎకరాల్లో ప్లాట్ల దందా
కోట్ల విలువ చేసే భూములు అన్యాక్రాంతం