లయన్స్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో ఉచిత వైద్యశిబిరం | - | Sakshi
Sakshi News home page

లయన్స్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో ఉచిత వైద్యశిబిరం

May 30 2025 1:36 AM | Updated on May 30 2025 1:36 AM

లయన్స్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో  ఉచిత వైద్యశిబిరం

లయన్స్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో ఉచిత వైద్యశిబిరం

మద్నూర్‌: మండలంలోని కొడిచిరలో డాక్టర్‌ కేవీ రెడ్డి మెమోరియల్‌ లయన్స్‌ క్లబ్‌ ఆఫ్‌ బోధన్‌ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. శిబిరంలో 62 మంది కంటి పరీక్షలు నిర్వహించుకోగా 18 మందికి మోతిబిందు ఉన్నట్లు వైద్యుడు అజయ్‌ తెలిపారు. కార్యక్రమంలో క్యాంప్‌ ఇన్‌చార్జి హన్మంత్‌రావు, సిబ్బంది రఫిక్‌, జీపీ కార్యదర్శి రాజు,ఆశావర్కర్‌ రుక్మిణి,గ్రామస్తులు పాల్గొన్నారు.

తాడ్వాయిలో..

తాడ్వాయి: మండల కేంద్రంలోని అంగన్‌వాడీ కేంద్రాల్లో ఆర్‌బీఎస్‌కే ఆధ్వర్యంలో గురువారం ఉచిత కంటి వైద్యశిబిరం నిర్వహించారు. కంటి వైద్యుడు లింబాద్రి పిల్లలకు కంటి పరీక్షలు చేశారు. అవసరం ఉన్న వారికి మందులు, కంటి అద్దాలను ఉచితంగా పంపిణీ చేశారు. కార్యక్రమంలో హరీశ్‌గౌడ్‌, స్వప్న, లింబాద్రి, నీరజ, అంగన్‌వాడీ టీచర్లు పాల్గొన్నారు.

డీపీఎంల నుంచి షురూ..

బదిలీకు ఆప్షన్లు ఇచ్చిన సెర్ప్‌

డొంకేశ్వర్‌(ఆర్మూర్‌): ఐకేపీలో ఉద్యోగ బదిలీల ప్రక్రియ మొదలైంది. డీపీఎంల నుంచి బదిలీలను మొదలు పెట్టిన రాష్ట్ర సెర్ప్‌ శాఖ వారికి ఆప్షన్లు పెట్టుకోవాలని సూచించింది. జిల్లాలో ఆరుగురు డీపీఎంలతోపాటు ఒక ఏపీడీ ఉన్నారు. వీరందరినీ బదిలీ చేసేందుకు ఆప్షన్‌ ఫారాలను ఇచ్చింది. వీటిని నింపిన డీపీఎంలు, ఏపీడీ సెర్ప్‌ శాఖకు హార్డ్‌కాపీని అందజేయగా ఆన్‌లైన్‌లో కూడా ఆప్షన్లు పెట్టుకున్నారు. రెండు, మూడు రోజుల్లో సెర్ప్‌ సీఈవో వీరికి వెబ్‌ కౌన్సెలింగ్‌ ద్వారా బదిలీలు చేపట్టనున్నారు. అయితే, డీపీఎంల బదిలీలు పూర్తయిన వెంటనే ఏపీఎంలు, సీసీలకు కూడా బదిలీలకు ఆప్షన్లు ఇవ్వనున్నారు. వీరికి జిల్లా స్థాయిలోనే డీఆర్‌డీవో ఆధ్వర్యంలో కౌన్సెలింగ్‌ జరుగుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement