
కాలువతో భక్తులకు ఇబ్బందులు
ఎల్లారెడ్డి: పట్టణంలోని అయ్యప్ప ఆలయం ముందు తవ్విన కాలువతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆలయం ముందు తవ్విన కాలువతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని భక్తులు పేర్కొన్నారు. మున్సిపల్ అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని భక్తులు కోరుతున్నారు.
కుక్కల దాడిలో జింక మృతి
రుద్రూర్: పొతంగల్ మండలం టాక్లీ శివారులో బుధవారం జింకల గుంపు నుంచి దారి తప్పి వచ్చిన ఓ జింకపై కుక్కలు దాడి చేయడంతో మృతి చెందింది. విషయం తెలుసుకున్న ఫారెస్ట్ సెక్షన్ అధికారి సురేశ్ గ్రామానికి చేరుకొని జింక కళేబరాన్ని అటవీ ప్రాంతంలో దహనం చేశారు. మంజీరా పరివాహక ప్రాంతంలో ఇటీవల జింక పిల్లలు మృతి చెందుతున్నాయి. వారం రోజుల్లో సోంపూర్, టాక్లీ, యాద్గార్పూర్ గ్రామాల్లో కుక్కల దాడిలో నాలుగు జింకలు మృత్యువాత పడ్డాయి. మంద నుంచి దారి తప్పిన జింక పిల్లలు గ్రామ శివారుల్లోకి రావడంతో కుక్కలు దాడి చేస్తున్నాయి. వారం రోజులుగా వర్షాలు పొలాల్లో బురద ఉండడం వల్ల జింక పిల్లలు పరిగెత్తలేకపోతున్నాయి. దీంతో అవి కుక్కల బారిన పడి మృత్యువాత పడుతున్నాయి. మూగ జీవాలను కాపాడాలని జంతు ప్రేమికులు కోరుతున్నారు.